Pakistan: “మమ్మల్ని ఖతార్ అనుకుంటున్నావా”, ఇజ్రాయిల్కు పాక్ వార్నింగ్.. దాడులతో కలవరం..
- ఇజ్రాయిల్ దాడులతో పాకిస్తాన్లో కలవరం..
- ఇరాన్లో రాయబార కార్యాలయం సమీపంలో ఇజ్రాయిల్ దాడి..
- తమను ఖతార్ అనుకుంటున్నావా? అంటూ పాక్ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులతో పాకిస్తాన్లో కలవరం మొదలైంది. గురువారం రాత్రి 08 గంటల ప్రాంతంలో టెహ్రాన్పై ఇజ్రాయిల్ భారీ దాడి చేసింది. పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి సమీపంలో ఈ దాడి జరిగింది. తమ రాయబార కార్యాలయానికి సమీపంలో దాడి జరగడంపై పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్కు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ‘‘దాడులు చేస్తే ఖతార్లా మేము మౌనంగా ఉండము’’ అని పాకిస్తాన్ ఇజ్రాయిల్ను గట్టిగా హెచ్చరించింది.
Read Also: US-Iran Conflict: పెరిగిన ‘‘పిజ్జా ఆర్డర్లు’’.. ఇరాన్పై బిగ్ యాక్షన్కు అమెరికా సిద్ధం..?
Also Read
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
- Modi-Trump: బెంగాల్లో విజయంపై మోడీని అభినందించిన ట్రంప్
సమాచారం ప్రకారం.. రాయబార కార్యాలయాన్ని ఇజ్రాయిల్ నేరుగా లక్ష్యంగా చేసుకోలేదు. పాకిస్తానీ దౌత్యవేత్తలు, వారి సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. దాడి ఫలితంగా ఆ ప్రాంతంలోని నివాసాలు ఒక్కసారిగా వణికిపోయాయి. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరం తీవ్ర హెచ్చరిక చేసింది. ఆ ప్రకటనలో, “పాకిస్తాన్ ఖతార్ కాదని ఇజ్రాయెల్ గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడైనా మా దౌత్యవేత్తలకు హాని జరిగితే, మీరు ఎప్పటికీ గుర్తుంచుకునేలా మేము దాడి చేస్తాము” అని పేర్కొంది.
ఇరాన్ యుద్ధం ముగిసేలా అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్, యూఎస్ అంగీకరిస్తే ఇస్లామాబాద్ చర్చలకు వేదికగా మారుతుందని పాకిస్తాన్ చెబుతోంది. పాక్తో పాటు టర్కీ, ఈజిప్ట్ కూడా సమస్యను ముగించడానికి తెరవెనక చర్చలు సాగిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య గతంలో పరోక్ష చర్చలు జరిగాయని, అతి త్వరలో పాకిస్థాన్లో జరగనున్న సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని జర్మన్ విదేశాంగ మంత్రి జోహన్ వాడేఫుల్ అన్నారు.
తాజావార్తలు
-
Ramachandra Rao: కర్ణాటక మాజీ డీజీపీ రామచంద్ర రావుకు భారీ ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
SRH Vs PBKS: 3 ఓవర్లలోనే మరో రికార్డు నెలకొల్పిన కాటేరమ్మ కొడుకులు.. ఉప్పల్ లో పరుగుల వరద..
-
Mamata Banerjee: రాజీనామాకు ససేమిరా.. సుప్రీంకోర్టుకు మమతా బెనర్జీ..
-
MK Stalin-Rajinikanth: స్టాలిన్ను కలిసిన రజనీకాంత్.. మాజీ సీఎంకు ఓదార్పు
-
Bengal Political Crisis: మమత కోటలో అధికారులు ఖాళీ.. మాజీ సీఎస్ నుంచి అడ్వకేట్ జనరల్ వరకు వరుసగా రాజీనామాలు!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!