IndiGo: మధ్యప్రాచ్యంలోని ఇరాన్ యుద్ధ ప్రభావం దేశ విమానయాన రంగంపై పడింది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో, టికెట్లపై ‘‘ఫ్యూయల్ సర్చార్జ్’’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు మార్చి 14 అర్థరాత్రి 12 నుంచి అమలులోకి వస్తాయని సంస్థ తెలిపింది.
Iran War: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ అన్ని దేశాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఇంధన భద్రత దెబ్బతింది. ఇజ్రాయిల్, అమెరికా దాడుల తర్వాత ఇరాన్ అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేంది. ప్రపంచ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకంగా ఉన్న ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ కంట్రోల్ చేస్తోంది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఇరాన్ క్షమాపణలు చెప్పిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశం’’గా అభివర్ణించారు. ఇరాన్ ఈ రోజు చాలా తీవ్రంగా దెబ్బతింటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, భారత నౌకాదళం అత్యంత అప్రమత్తమై తన వ్యూహాత్మక శక్తిని చాటుతోంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ప్రాంతాల్లో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతున్న తరుణంలో, భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అత్యంత అధునాతన యుద్ధనౌక ‘INS సూరత్’ను రంగంలోకి దించింది. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల ప్రభావం సముద్ర మార్గాలపై పడటం, హౌతీ రెబల్స్ డ్రోన్ దాడులతో కార్గో షిప్పులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి పెను…
Iran Israel War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ వారు(ఇరాన్) మాట్లాడాలనుకుంటున్నారు. నేను ఆలస్యమైందని చెప్పాను. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది’’ అని అన్నారు. ఆదివారం ఇరాన్ నాయకుల అభ్యర్థన మేరకు వారితో మాట్లాడటానికి అంగీకరించానని ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత, దీనికి విరుద్ధంగా తాజా ప్రకటన వచ్చింది.
Telangana Government: మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా)లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పౌరుల కోసం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రభుత్వం 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ ప్రభుత్వం సమగ్రంగా పర్యవేక్షిస్తోంది. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు సంబంధిత భారత రాయబార కార్యాలయాలతో…
Next Supreme Leader of Iran: ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం ఇప్పుడు పెను రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. ఇటు అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, అటు అంతర్గత అధికార పోరు మధ్య ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ అధికారిక మీడియా ‘ప్రెస్ టీవీ’ కూడా ఖమేనీ మరణాన్ని ధృవీకరించడంతో, ఇప్పుడు అందరి దృష్టి “ఖమేనీ వారసుడు ఎవరు?” అనే అంశంపైనే ఉంది. ఇరాన్…
Ayatollah Ali Khamenei: మధ్యప్రాచ్య రాజకీయాలను నాలుగు దశాబ్దాల పాటు శాసించిన ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ (86) శకం ముగిసింది. శనివారం అర్ధరాత్రి అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ దాడిలో ఖమేనీ మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. 1989 నుంచి ఇరాన్ను తన గుప్పిట్లో ఉంచుకున్న ఖమేనీ మరణంతో ఆ దేశంలో ఒక యుగం అంతమైంది. READ ALSO: Minab Airstrike: ఇరానియన్ బాలికల పాఠశాలపై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక…
Israel-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా పశ్చి్మాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. ఈ దాడులు సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రైయిన్, ఇరాక్పై కొనసాగాయి. దుబాయ్, రియాద్, అబుదాబి నగరాలు దాడులకు గురయ్యాయి. Read Also: Sri Lanka vs Pakistan: ఫర్హాన్ ఊచకోత.. పాకిస్థాన్ తుఫాన్ ఇన్నింగ్స్..…