రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ మేడారం జాతరలో పాల్గొన్నారు.ఈ పర్యటనలో మంత్రులు, కలెక్టర్, ఎస్పీ గైర్హాజర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర తొలి పౌరురాలికి ఇంత అవమానమా? గవర్నర్ కు ఇచ్చే మర్యాద ఇదేనా? మహిళ అని చూడకుండా అవమానిస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కల్వకుంట్ల రాజ్యాంగం ?కోట్లాదిమంది ప్రజలు సందర్శించే మేడారం జాతరకు వెళ్లకుండా గిరిజనులను సీఎం కేసీఆర్…
మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. వనదేవతలను దర్శించుకున్న ఆమె.. గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.. ఇక, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వన దేవతలు సమ్మక్క సారలమ్మలను అతి పెద్ద గిరిజన జాతర మేడారంలో దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ఈ అతి గొప్ప ఆదివాసీ జాతర ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు.. తెలంగాణ ప్రజలంతా…
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ మేడారం జాతరకు ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… సీఎం, పీఎం మేడారం జాతరను చిన్నగా చేసి చూపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.. మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ఆయన.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరుపెట్టాలని డిమాండ్ చేశారు.. కాంగ్రెస్ ది భిన్నత్వంలో ఏకత్వం… ప్రాంతీయ పార్టీల్లో ఏకత్వంలో మూర్ఖత్వం అంటూ ఎద్దేవా చేసిన ఆయన..…
ఇవాళ్టి నుంచి మేడారంలో మహాజాతర. నాలుగురోజుల పాటు జరగనున్న జాతరకు కోటిన్నరమంది భక్తులు వస్తారని అంచనా. హెలికాప్టర్ లోనూ మేడారం వెళ్ళే అవకాశం. ఇవాళ తిరుమలలో మాఘమాస పౌర్ణమి సేవ నిర్వహిస్తున్న టీటీడీ. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై మాఢ వీధులలో విహరించనున్న మలయప్పస్వామి. తిరుమలలో ఉదయాస్తమాన సేవా యాప్ ని ప్రారంభించనున్న టీటీడీ. ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించనున్న టీటీడీ. తిరుమల అంజనాద్రిలో…
ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. ఈ జాతర కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వ తేదీ వరకు జాతర జరగబోతున్నది. చరిత్ర ప్రకారం కాకతీయ సైన్యానికి, పగిడిగిద్దరాజు సైన్యానికి మధ్య లక్నవరం వద్ద యుద్దం జరుగుతుంది. ఈ యుద్దంలో పగిడిగిద్దరాజుతో పాటు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు పాల్గొంటారు. ఈ యుద్ధంలో పోరాడి మేడారం సమీపంలోని సంపెంగ వాగు వద్ద వీరమరణం పోందారు.…
తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీపై మండిపడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. మేడారం జాతరకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎంపీ బండి సంజయ్ ను ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ తెలంగాణలోనే ఉండటం మనందరికీ గర్వకారణం అన్నారు ఎమ్మెల్సీ కవిత. స్వరాష్ట్రంలో నాలుగు సార్లు వైభవంగా జరిగిన మేడారం జాతర నిర్వహణ కోసం సీఎం కేసీఆర్ మొత్తం 332.71 కోట్ల రూపాయలను విడుదల చేశారన్నారు. 2014…
మేడారం జాతర ఫిబ్రవరి నెలలో ప్రారంభం కాబోతున్నది. ఫిబ్రవరి 16 నుంచి జాతర ప్రారంభం కాబోతున్నది. అయితే, జాతర కంటే ముందే భక్తులు మేడారంకు పోటెత్తుతున్నారు. జాతరలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు మేడారంకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరోనా మహమ్మారి ఆంక్షలు, జాతర సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారనే ఉద్దేశంతో ముందుగానే భక్తులు మేడారం చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సీజన్ మొదలైంది. ఇంటి ఇలవేల్పులకు మొక్క చెల్లించేందుకు పెద్దఎత్తున భక్తులు జాతరలకు వెళ్తుంటారు. కరోనా పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ జాతరల్లో ముందు జాగ్రత్తల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. జనవరి మాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలో జాతర సీజన్ మొదలవుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొత్తకొండ, కొమురవెల్లి, మేడారం జాతరలు జరుగుతాయి. సంక్రాంతి నుంచి మొదలయ్యే జాతరలతో ఉమ్మడి…
మేడారం వెళ్లే సమ్మక్క, సారలమ్మ భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ… ఇవాళ్టి నుంచి మేడారం ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుంది ఆర్టీసీ… హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఈ సర్వీసులు ప్రతీ రోజు అందుబాటులో ఉండనున్నాయి.. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది.. ఇక, దీనికి చార్జీలను కూడా ఫిక్స్ చేసింది…
కరోనాతో ప్రపంచం అల్లకల్లోలం అయింది. కరోనా తగ్గిందనుకునేలోపే ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతోంది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. మేడారంకి ముందస్తు మొక్కుల కోసం వస్తున్న వాళ్ళను కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. టీకా వేసుకున్న వారికే వనదేవతల దర్శనానికి అనుమతి ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్లకు ఒక్కసారి జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతరకు అప్పుడే జనం తాకిడి పెరిగింది. కరోనా థర్డ్ వేవ్ వస్తుంది అని జరుగుతున్న ప్రచారం నేపథ్యం…