Minister Seethakka: గతంలో కంటే నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయి.. ములుగులో సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: గతంలో కంటే మంత్రిగా నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రి సీతక్క తొలిసారిగా ములుగు నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ములుగు జిల్లా మహ్మద్ గౌస్ పల్లిలో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి నుంచి గట్టమ్మ గుడి వరకు 15 కిలోమీటర్ల మేర ర్యాలీగా బయలుదేరారు. గట్టమ్మను దర్శించుకోకుండా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మేడారం వెళ్లారు. త్వరలో మేడారంలో నిర్వహించే జాతరపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రిగా ఇతర భాద్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తా అన్నారు.
Read also: Vemulawada: భక్తులకు అలర్ట్.. రాజన్న ఆలయంలో ఆర్జిత సేవలు నిలిపివేత
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
నేను ఎక్కడున్నా ములుగే నా కుటుంబం, ములుగు ప్రజలు నా కుటుంబ సభ్యులని అన్నారు. గతంలో కంటే మంత్రిగా నాపై బాధ్యతలు ఎక్కువగా పెరిగాయని తెలిపారు. ప్రజలకు జవాబు దారిగా చెప్పాల్సిన బాధ్యత నాపై పెరిగిందన్నారు. ఎక్కడ ఉన్నా ములుగు జిల్లా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతా అని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతా అన్నారు. వెనుకబడిన గ్రామాల అభివృద్ధికి దోహద పడే అవకాశం రావడం అదృష్టంగా బావిస్తున్నానని తెలిపారు. మధ్యాహ్నం 2:30 గంటలకు భోజనం విరామం అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు జిల్లా అధికార యంత్రాంగంతో మేడారం జాతర రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 6 గంటలకు ఆదివాసి భవన్ మేడారంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అనంతరం సాయంత్రం 7: 30 గంటలకు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బస చేయనున్నారు.
Harirama Jogaiah: టీడీపీ-జనసేన బంధాన్ని బలహీన పర్చేందుకు వైసీపీలోని కాపు మంత్రులు ప్రయత్నాలు
తాజావార్తలు
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
-
Budhaditya Rajyog 2026: మిథునంలో సూర్యుడు.. 5 రాశుల వారికి రాజయోగాల జాక్పాట్.!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!