తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సారక్క జాతర వైభవోపేతంగా జరుగుతోంది. నిన్న ప్రారంభమైన తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చేసింది. మేడారం జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టింది. మేడారం జాతారను ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి.
తెలంగాణ మహాజాతర మేడారం ప్రారంభం అయింది. మేడారంలో గద్దెల మీద కొలువు తీరనున్నారు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు. ఈ రోజునుంచి 19 వరకూ జాతర జరుగుతుంది. ఈ జాతరకు వెళ్ళాలనుకునేవారికి అద్భుతమయిన అవకాశం లభించింది. హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై.. 20 వరకు అందుబాటులో ఉంటాయి. జాయ్రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల హెలికాప్టర్ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు.…
తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. ఒకప్పుడు ఆదివాసీలు, గ్రామీణులు మాత్రమే ఈ జాతరలో పాల్గొనే వారు. ఈ జాతరకు రెండు దశాబ్దాల క్రితం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎడ్ల బండ్లలో తరలి వెళ్లేవారు. కాల క్రమేణా జంపన్న వాగు పై బ్రిడ్జి నిర్మాణం అనంతరం ఎడ్ల బండ్లపై వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా తగ్గి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారి సంఖ్య అధికమైంది. 2012లో మొదటి సారిగా హెలికాప్టర్ ద్వారా రాకపోకలను…
తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా అడవి తల్లి బిడ్డలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. బుధవారం మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని అభివర్ణించారు. దేశం నలుమూలల ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల…
ఆదివాసి కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమక్క సారక్క జాతరకు బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడారం జాతరకు నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు సమక్క సారక్కలను దర్శించేందుకు వస్తుంటారు. అంతేకాకుండా తెలంగాణకే సమక్క సారక్క జాతర తలమానికంగా నిలిచింది. అయితే మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పోలీస్ శాఖ 9 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో…
ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 కు రంగం సిద్ధం అయింది. కరోనా ఇబ్బందులు వున్నా జాతర నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. జాతర జరుగుతుందో లేదో అని భక్తుల్లో ఉన్న అపోహలను మంత్రులు తొలగించారు. ఈ సారి గరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్, డీజీపీ ప్రకటించారు. మేడారం జాతర నిర్వహణ తో…
తెలంగాణాకే తలమానికమైన మేడారం జాతరకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తొమ్మిది వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం పహారా కాయనున్నట్లు ఆయన తెలిపారు. క్రౌడ్ కంట్రోల్ నియంత్రణకు 33 డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 33 చోట్ల పార్కింగ్ స్థలాన్ని పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. 37…
మేడారం భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మేడారం జాతర వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈనెల 13 నుంచి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందిస్తామని తెలిపింది. ఈ మేరకు గత ఏడాది తరహాలో ఈ ఏడాది కూడా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్తులను హెలికాప్టర్ ద్వారా మేడారం తీసుకువెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్…
సమ్మక్క-సారక్క జాతర ముగియగానే ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గురువారం తెలిపారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. “నీతి ఆయోగ్ యొక్క 2019-20 ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానాన్ని పొందగా, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ దిగువన ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది. రాష్ట్ర…
ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వివిధ ప్రాంతాల నుండి టీఎస్ఆర్టీసీ వరంగల్ రీజియన్ ద్వారా సుమారు 2,200 బస్సులు నడపబడతాయని, గ్రేటర్ వరంగల్ నగర పరిధిలోని మూడు పాయింట్ల నుంచి 900 బస్సులు నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హైదరాబాద్, కరీంనగర్ జోన్లు) పీవీ మునిశేఖర్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మునిశేఖర్ తెలిపారు. ఈ ద్వైవార్షిక జాతర కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల…