తెలంగాణ మహాజాతర మేడారం ప్రారంభం అయింది. మేడారంలో గద్దెల మీద కొలువు తీరనున్నారు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు. ఈ రోజునుంచి 19 వరకూ జాతర జరుగుతుంది. ఈ జాతరకు వెళ్ళాలనుకునేవారికి అద్భుతమయిన అవకాశం లభించింది. హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభమై.. 20 వరకు అందుబాటులో ఉంటాయి. జాయ్రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల హెలికాప్టర్ సేవలను భక్తులు వినియోగించుకోవచ్చు. జాయ్రైడ్ ద్వారా గగన విహారం చేస్తూ మేడారం జాతర ను ఎంచక్కా ఆకాశం నుంచి చూడవచ్చు. సుమారు 7 నుంచి 8 నిమిషాల వరకు ఈ అవకాశం ఉంటుంది. హనుమకొండ -మేడారం వరకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు షటిల్ సర్వీస్లు వున్నాయి.
షటిల్ సర్వీస్తో.. 20 నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోవచ్చు. కరీంనగర్ -మేడారం, హైదరాబాద్-మేడారం, మహబూబ్నగర్-మేడారం రూట్లలో చార్టర్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో 5 సీట్స్ ఉంటాయి. హెలికాప్టర్ సేవలు వినియోగించుకునే భక్తులకు వీఐపీ దర్శనం అందిస్తారు.
సర్వీసులు ఎలాగంటే..
జాయ్రైడ్ సర్వీస్ద్వారా మేడారంలో గగన విహారం వుంటుంది. 7-8 ని.ల పాటు జాతర విహంగ వీక్షణం చేయవచ్చు. ఇందుకోసం రూ.3,700 ధర చెల్లించాలి.
షటిల్ సర్వీస్ హనుమకొండ -మేడారం వుంటుంది. కేవలం 20 నిమిషాల్లో జాతరకు వెళ్ళవచ్చు. అందుకోసం రూ.19,999 చెల్లించాలి.
చార్టర్ సర్వీస్ హైదరాబాద్-మేడారం అందుబాటులో వుంటుంది. ఇందులో 5 సీట్లుంటాయి. వీఐపీ దర్శనం అందుబాటులో వుంటుంది. ఇందుకోసం రూ.75,000 చెల్లించాలి.
కరీంనగర్ -మేడారం హెలికాప్టర్ సర్వీసు కావాలంటే రూ.75,000 చెల్లించాలి. మహబూబ్నగర్-మేడారం సర్వీస్ కోసం రూ 1,00,000 ధర చెల్లించాలి.