తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా అడవి తల్లి బిడ్డలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. బుధవారం మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని అభివర్ణించారు.
దేశం నలుమూలల ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల జాతర నయనందకరం, భక్తి ముక్తిదాయకం అని పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వన జాతర దేశానికే తలమానికం అని కీర్తించారు. తెలంగాణ వాసులతో పాటు, దేశ ప్రజలందరినీ దుష్ట శక్తుల నుంచి ఈ వనదేవతలు కాపాడాలని, ప్రజలను చల్లగా చూడాలని ప్రణామాలు అర్పిస్తున్నట్టు ట్వీట్లో పవన్ తెలిపారు.
ప్రజలను వనదేవతలు చల్లగా చూడాలి – JanaSena Chief Shri @PawanKalyan #MedaramJatara #SammakkaSaralamma#tribalfestival pic.twitter.com/DJ82lUuEX1
— JanaSena Party (@JanaSenaParty) February 15, 2022