Manipur MLAs: మణిపూర్ అల్లర్లపై మోడీతో భేటీ అయ్యేందుకు 40 మంది ఎమ్మెల్యేల ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ రాష్ట్రంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లపై దేశం మొత్తం స్పందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదని విపక్ష కూటమి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై ఇవాళ లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ఇక, తాజాగా మణిపూర్ లో చేలరేగిని హింస నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోడీతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు 40 మంది ఎమ్మెల్యేలు పీఎంఓకు ఓ లేఖ రాశారు.
Read Also: Bharat Express: సికింద్రాబాద్ వచ్చే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో పొగలు..
Also Read
మణిపూర్ రాష్ట్రంలోని రెండు గిరిజన తెగల మధ్య చెలరేగిన హింస వల్ల మూడు నెలలుగా అశాంతి నెలకొంది అని ఆ లేఖలో 40 మంది ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేల లేఖ రాయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై విపక్ష పార్టీలు అధికార పక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి. పార్లమెంట్ లో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక, దీనిపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఈ తీర్మానంపై చర్చలో పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు.
Read Also: Kurnool Road Accident: కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు!
అయితే, మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది. మోడీ రిప్లై తరువాత ఈ తీర్మానంపై లోక్ సభలో ఓటింగ్ జరుగుతుంది. బీజేపీ-ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉండటం వల్ల ఈ తీర్మానం వీగిపోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎన్డీఏకు 331.. బీజేపీకి సొంతంగానే 303 ఎంపీలు ఉన్నారు.. ఇక, విపక్షాల కూటమికి 144 మంది ఎంపీల బలం ఉంది. మరో 70 మంది ఎంపీలు తటస్థంగా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..