Manipur Violence: నివురు గప్పిన నిప్పులా మణిపూర్.. 15 రోజుల విరామం తర్వాత మళ్లీ హింస..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ తెగకు చెందిన ముగ్గురిని దుండగులు కాల్చిచంపారు. శుక్రవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున 4.30 గంటలకు కుకి ప్రజలు నివసించే తోవాయి కుకి గ్రామ శివారులోని గుట్టల మటు నుంచి కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో మణిపూర్లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. 15 రోజుల గ్యాప్ తర్వాత రాష్ట్రం మళ్లీ అగ్గి రాజుకుంది. చివరిసారి ఆగస్టు 5న వేర్వేరు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలో ఐదుగురు చనిపోయారు. వీరిలో ముగ్గురు మీతీ తెగకు చెందినవారు కాగా మరో ఇద్దరు కుకీ తెగకు చెందినవారు. మే 3 నుంచి మణిపూర్లో గిరిజనుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో కుకీ తెగకు చెందిన ముగ్గురు మృతి చెందినట్లు ఉఖ్రుల్ జిల్లా పోలీసు అధికారి ఎన్. వాషుమ్ అన్నారు. ఉఖ్రుల్ జిల్లా కేంద్రం నుండి ఉదయం 4.30 గంటలకు 47 కి.మీ. కుకీ తెగ నివసించే తోవై కుకి గ్రామం వద్ద కొండపై నుంచి సాయుధ దుండగులు కాల్పులు జరిపారని ఆయన వెల్లడించారు.
Read also: Minister KTR: నాయిని నర్సింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి.. నేడు ప్రారంభించనున్నకేటీఆర్
Also Read
- New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
మణిపూర్ వాసులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రతి క్షణం వేదనతో గడుపుతున్నారు. ఘర్షణల నేపథ్యంలో గ్రామస్తులు గ్రూపులుగా విడిపోయి కాపలా కాస్తున్నారు. తోవై కుకి గ్రామంలో కాపలాగా ఉన్న గ్రామస్తులపై దుండగులు కాల్పులు జరిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మణిపూర్లో శాంతి స్థాపన కోసం పోలీసులతో కలిసి భారత సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. గత కొద్దిరోజులుగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా తప్పించుకోగలిగారు. సున్నితమైన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. మణిపూర్లో చెలరేగిన హింసలో ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 3000 మందికి పైగా గాయపడ్డారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
Indian Railways: వాణిజ్య అవసరాలకు భూమిని లీజుకు ఇవ్వనున్న రైల్వే.. 7,500 కోట్లు సమీకరించే ప్లాన్
తాజావార్తలు
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
God Of War : త్రివిక్రమ్తో సినిమా కోసం ఎన్టీఆర్ – అల్లు అర్జున్ ఎందుకు పోటీపడ్డారు.. ఇన్ సైడ్ స్టోరీ
-
Gold & Silver Prices Today: సామాన్యుల్లో చిగురిస్తున్న ఆశలు.. భారీగా పడిపోయిన గోల్డ్ ధరలు
-
New Rules From July 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 10 కీలక మార్పులు ఇవే..!
-
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!