Sharad Pawar: అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ కురువృద్ధుడు శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ మరణంలో ఎలాంటి కుట్ర లేదని, ఇది కేవలం ప్రమాదమే అని స్పష్టం చేశారు. ఈ విషాదాన్ని రాజకీయ చేయొద్దని ఇతర పార్టీలు, నేతలను కోరారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వంటి వారు అజిత్ పవార్ మరణంపై అనుమానాలను వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షనలో దర్యాప్తుకు పిలుపునిచ్చారు. అన్న కొడుకైన అజిత్ పవార్…
ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ఉదయం 8:45 – 9:15 గంటల మధ్య ప్రమాదానికి గురైంది. బారామతి విమానాశ్రయ రన్వేపై దిగడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో విమానంలో తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేకు బదులుగా సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లి భూమిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం ముక్కలుగా విరిగిపోవడంతో పాటు భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు…
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మరణం తీవ్ర విషాదంగా మారింది. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా అందరూ మరణించారు. దీంతో, మహాయుతి సర్కార్లో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన మృతదేహాన్ని పూణేకు తరలించారు. రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.
Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఎన్సీపీ అధినేత, మహాయుతిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి విమాన ప్రమాదంలో మరణించారు. అయితే, ఇప్పుడు ఎన్సీపీకి పెద్ద దిక్కు ఎవరు కాబోతున్నారనే ప్రశ్న వినిపిస్తుంది. శరద్ పవార్తో విభేదాల తర్వాత, ఎన్సీపీలో చీలిక వచ్చింది. మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు, నేతలు అజిత్ పవార్తో ఉన్నారు. వీరంతా ఎన్డీయేలో భాగస్వాములయ్యారు. అయితే, ఇప్పుడు అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ అధినేతగా ఆయన…
Yunus Shaikh:ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. ఇదే కాకుండా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, అమరావతి, ధులే, షోలాపూర్, నాగ్పూర్, థానే మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఎంఐఎం సత్తా చటాటింది. మొత్తంగా మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 125 స్థానాలను గెలుచుకుంది. ఈ గెలుపుపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు.
Maharashtra: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. దేశంలో అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబై మేయర్ పీఠాన్ని బీజేపీ, శివసేనలు కలిసి దక్కించుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ముంబైతో పాటు పలు కార్పొరేషన్లలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మేయర్ పదవి కోసం ప్రతిష్టంభన ఏర్పడింది.
Nagpur: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 28 ఏళ్ల తర్వాత బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ఠాక్రేలు ముంబైపై తమ పట్టును కోల్పోయారు. ఇదే కాకుండా, పవార్ల ప్రభావం ఉన్న సీట్లను కూడా బీజేపీ గెలుచుకుంది.
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీని సాధించి, తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా శివసేన (UBT) కంచుకోటగా ఉన్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లో బీజేపీ సాధించిన విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గెలుపు కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాకుండా, మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసిన సంఘటనగా నిలిచిపోయింది.…
Sanjay Raut: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో శివసేన యూబీటీ నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడే రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఠాక్రేలను ఎప్పటికీ తుడిచిపెట్టలేరు. మేము తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైని బంద్ చేయగలం’’ అని హెచ్చరించారు.
Uddhav Thackeray: తాను ప్రధాని నరేంద్రమోడీ కోసం రెండుసార్లు ప్రచారం చేశానని, కానీ ఆయన తన పార్టీని రెండుగా చీల్చారని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 2014, 2019లో ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఇప్పుడు తన పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని ప్రధాని చేయాలని తాను చెప్పానని, ఇప్పుడు నన్ను అంతం చేయాలని అంటున్నారని ఠాక్రే అన్నారు. ఇప్పుడు ఈ రెండు విషయాలను ప్రజలు గమనించడం ప్రారంభించారని చెప్పారు.