Sanjay Raut: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో శివసేన యూబీటీ నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడే రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఠాక్రేలను ఎప్పటికీ తుడిచిపెట్టలేరు. మేము తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైని బంద్ చేయగలం’’ అని హెచ్చరించారు.
Uddhav Thackeray: తాను ప్రధాని నరేంద్రమోడీ కోసం రెండుసార్లు ప్రచారం చేశానని, కానీ ఆయన తన పార్టీని రెండుగా చీల్చారని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 2014, 2019లో ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఇప్పుడు తన పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని ప్రధాని చేయాలని తాను చెప్పానని, ఇప్పుడు నన్ను అంతం చేయాలని అంటున్నారని ఠాక్రే అన్నారు. ఇప్పుడు ఈ రెండు విషయాలను ప్రజలు గమనించడం ప్రారంభించారని చెప్పారు.
Devendra Fadnavis: “బుర్ఖా ధరించిన ముస్లిం” ముంబై మేయర్ పీఠాన్ని చేపట్టవచ్చని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల మౌనాన్ని సీఎం దేవేంద్ర పడ్నవీస్ ప్రశ్నించారు. మరాఠీ హిందువే తదుపరి ముంబై మేయర్ అవుతారని ఆయన అన్నారు. బీజేపీకి దేశమే మొదటి ప్రాధాన్యత అని, బీజేపీ మరాఠీ, మరాఠీయేతర ఓటర్లనున విభజించడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలను తిప్పికొట్టారు. ముంబై మేయర్ పదవి మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడిందా.? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. అవును అంటూ…
Operation Sindoor: పహల్గాంలో ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
MVA Protest Mumbai: ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే, ఎన్సిపి (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థోరట్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)) అధ్యక్షుడు రాజ్ థాకరే, ఇతర మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) పార్టీల నాయకులతో కలిసి శనివారం ముంబైలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన శనివారం మధ్యాహ్నం దక్షిణ ముంబైలోని ఫ్యాషన్ స్ట్రీట్ నుంచి…
BJP MLA: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లవద్దని ఎమ్మెల్యే గోపీచంద్ పడాల్కర్ సలహా ఇచ్చారు. బీడ్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీకి వెళ్లే హిందూ అమ్మాయిలు జిమ్కు వెళ్లకూడదని, ఇంట్లో యోగా సాధన చేయాలని సూచించారు. కుట్ర జరుగుతోందని, ఎవరిని నమ్మాలో వారికి తెలియదని ఆయన అన్నారు.
Eknath Shinde: 26/11 ముంబై ఉగ్ర దాడుల తర్వాత, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్పై చర్యలు తీసుకోకపోవడం ‘‘ద్రోహం’’ అని శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే అన్నారు. ఎవరి ఒత్తిడితో కాంగ్రెస్ పాకిస్తాన్పై దాడికి సిద్ధ పడలేదని ప్రశ్నించారు. శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఉద్ధవ్ ఠాక్రే తన సొంత పార్టీ అనుచరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.
Uddhav Thackeray: ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్కు సంబంధించి శివసేన (యూబీటీ) చీఫ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన చేశారు. మ్యాచ్ను వీక్షించిన వారిని దేశద్రోహులుగా అభివర్ణించారు. థాకరే ప్రకటన రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిజానికి, పహల్గామ్ ఉగ్రవాద దాడి అనంతరం భారత్ పాకిస్థాన్పై కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇంతలో, ఆసియా కప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దీనిపై ప్రతిపక్షాలు…
Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్లో జరిగిన "ఐ లవ్ మొహమ్మద్" కార్యక్రమంలో ఒక మతాధికారి చేసిన ప్రకటన పెద్ద వివాదానికి దారితీసింది. బహిరంగ వేదిక నుంచి మతాధికారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను బహిరంగంగా సవాలు చేశారు. మజల్గావ్కు వస్తే.. సీఎం యోగిని అక్కడే ఖననం చేస్తానని హెచ్చరించాడు. ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.