Home
Maharashtra Politics
Maharashtra Politics News
-
Ajit Pawar: ఎన్నికల గుర్తు ‘‘గడియారం’’.. అదే గడియారంతో అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు..
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ మరణం తీవ్ర విషాదంగా మారింది. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. దీంతో విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో సహా అందరూ మరణించారు. దీంతో, మహాయుతి సర్కార్లో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ ఇప్పుడు పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన మృతదేహాన్ని పూణేకు తరలించారు. రేపు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. -
Sunetra Pawar: అజిత్ పవార్ మరణం.. ఎన్సీపీ కొత్త చీఫ్ “సునేత్ర పవార్” అవుతారా.?
Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఎన్సీపీ అధినేత, మహాయుతిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతి విమాన ప్రమాదంలో మరణించారు. అయితే, ఇప్పుడు ఎన్సీపీకి పెద్ద దిక్కు ఎవరు కాబోతున్నారనే ప్రశ్న వినిపిస్తుంది. శరద్ పవార్తో విభేదాల తర్వాత, ఎన్సీపీలో చీలిక వచ్చింది. మెజారిటీ వర్గం ఎమ్మెల్యేలు, నేతలు అజిత్ పవార్తో ఉన్నారు. వీరంతా ఎన్డీయేలో భాగస్వాములయ్యారు. అయితే, ఇప్పుడు అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీ అధినేతగా ఆయన… -
Yunus Shaikh: “ముంబ్రాకు ఆకుపచ్చగా మారుస్తాం”.. క్షమాపణలు చెప్పిన ఎంఐఎం కార్పొరేటర్..
Yunus Shaikh:ఇటీవల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. ఇదే కాకుండా, మహారాష్ట్రలోని ఔరంగాబాద్, మాలేగావ్, నాందేడ్, అమరావతి, ధులే, షోలాపూర్, నాగ్పూర్, థానే మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఎంఐఎం సత్తా చటాటింది. మొత్తంగా మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 125 స్థానాలను గెలుచుకుంది. ఈ గెలుపుపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. -
Maharashtra: బీజేపీకి బిగ్ షాక్.. మేయర్ పదవి కోసం ఒక్కటైన షిండే శివసేన, రాజ్ఠాక్రే..
Maharashtra: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. దేశంలో అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబై మేయర్ పీఠాన్ని బీజేపీ, శివసేనలు కలిసి దక్కించుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ముంబైతో పాటు పలు కార్పొరేషన్లలో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మేయర్ పదవి కోసం ప్రతిష్టంభన ఏర్పడింది. -
Nagpur: నాగ్పూర్ అల్లర్లలో నిందితుడు.. ఎంఐఎం టికెట్పై భార్య గెలుపు..
Nagpur: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 28 ఏళ్ల తర్వాత బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను కైవసం చేసుకుంది. ఠాక్రేలు ముంబైపై తమ పట్టును కోల్పోయారు. ఇదే కాకుండా, పవార్ల ప్రభావం ఉన్న సీట్లను కూడా బీజేపీ గెలుచుకుంది. -
BMC Elections : మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ప్రభంజనం.. ఫడ్నవీస్ వ్యూహరచనతో చారిత్రాత్మక విజయం
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఒక నూతన అధ్యాయాన్ని లిఖించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజారిటీని సాధించి, తన రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ముఖ్యంగా మూడు దశాబ్దాలుగా శివసేన (UBT) కంచుకోటగా ఉన్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) లో బీజేపీ సాధించిన విజయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ గెలుపు కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాకుండా, మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసిన సంఘటనగా నిలిచిపోయింది.… -
Sanjay Raut: ఠాక్రేలు తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబై బంద్.. అంత సీన్ లేదన్న ఫడ్నవీస్..
Sanjay Raut: ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో శివసేన యూబీటీ నేత, ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత సన్నిహితుడిగా పరిగణించబడే రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఠాక్రేలను ఎప్పటికీ తుడిచిపెట్టలేరు. మేము తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైని బంద్ చేయగలం’’ అని హెచ్చరించారు. -
Uddhav Thackeray: మోడీని ప్రధాని చేయాలని నేనే చెప్పా..
Uddhav Thackeray: తాను ప్రధాని నరేంద్రమోడీ కోసం రెండుసార్లు ప్రచారం చేశానని, కానీ ఆయన తన పార్టీని రెండుగా చీల్చారని శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 2014, 2019లో ప్రచారం చేసినప్పటికీ, ఆయన ఇప్పుడు తన పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. మోడీని ప్రధాని చేయాలని తాను చెప్పానని, ఇప్పుడు నన్ను అంతం చేయాలని అంటున్నారని ఠాక్రే అన్నారు. ఇప్పుడు ఈ రెండు విషయాలను ప్రజలు గమనించడం ప్రారంభించారని చెప్పారు. -
Devendra Fadnavis: ముంబై మేయర్ పీఠం మరాఠా హిందువుదే..
Devendra Fadnavis: “బుర్ఖా ధరించిన ముస్లిం” ముంబై మేయర్ పీఠాన్ని చేపట్టవచ్చని ఎంఐఎం నేత వారిస్ పఠాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల మౌనాన్ని సీఎం దేవేంద్ర పడ్నవీస్ ప్రశ్నించారు. మరాఠీ హిందువే తదుపరి ముంబై మేయర్ అవుతారని ఆయన అన్నారు. బీజేపీకి దేశమే మొదటి ప్రాధాన్యత అని, బీజేపీ మరాఠీ, మరాఠీయేతర ఓటర్లనున విభజించడానికి ప్రయత్నిస్తోందనే ఆరోపణలను తిప్పికొట్టారు. ముంబై మేయర్ పదవి మరాఠీ హిందువులకు రిజర్వ్ చేయబడిందా.? అని ఓ కార్యక్రమంలో ప్రశ్నించగా.. అవును అంటూ… -
Operation Sindoor: క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదు.. ఆపరేషన్ సింధూర్పై చేసిన వ్యాఖ్యలు సమర్థించుకున్న మాజీ సీఎం
Operation Sindoor: పహల్గాంలో ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తాజావార్తలు
-
Interest Rates: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ఈ వడ్డీ రేట్లు..
-
CM Revanth Reddy : అగ్రికల్చర్ పక్కనపెట్టి డ్రింకింగ్ కల్చర్ తెచ్చారు..
-
Salman Khan: గెలాక్సీ అపార్ట్మెంట్స్కు సల్మాన్ ఖాన్ గుడ్ బై! ముంబయిని షేక్ చేస్తున్న ‘సుల్తాన్’ కొత్త ఇంటి రేటు!
-
Gold: బంగారం కురిపిస్తున్న అగ్నిపర్వతం.. రోజుకు 80 గ్రాముల బంగారం గాల్లోకి..
-
Visakhapatnam: రాష్ట్రపతి పర్యటనలో కలకలం.. కాన్వాయ్ వైపు దూసుకొచ్చిన యువకుడు.!
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!