మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి భారీ మెజారిటీ సాధించింది. రాష్ట్రంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోవైపు జార్ఖండ్లో జేఎంఎం కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉంది. జేఎంఎం ప్లస్ 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీయే 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తాజాగా ఈ ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.
మహారాష్ట్రలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శివసేన (ఏక్నాథ్ షిండే) మహాయతి కూటమి ఘన విజయం సాధించడంతో బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ $3 బిలియన్ల ధారావి ప్రాజెక్టుకు ఉపశమనం లభించనుంది. దీని కింద ముంబైలోని మురికివాడ ధారవిని 'ప్రపంచ స్థాయి' జిల్లాగా పునరాభివృద్ధి పనులు షురూ అవుతాయని వార్తలు వస్తున్నాయి.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా భారత ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమికి గల కారణాలు సమీక్షిస్తామన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఓడిపోతుందని చాలామంది ఫలితాలకు ముందే చెప్పారు.. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని పురందేశ్వరి తెలిపారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి ట్రెండ్లో మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అంతే కాదు ఎన్డీయే కూటమి మెజారిటీని దాటేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, జార్ఖండ్లో జేఎంఎం ఘన విజయం సాధించింది. ఈరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మధ్య ప్రధాని మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలల్లో శరద్ పవార్ పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. శరద్ పవార్ పార్టీ కేవలం 12 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ ఘోర పరాజయం తర్వాత 84 ఏళ్ల శరద్ పవార్ ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇదే ఆయనకు చివరి ఎన్నికలా? రాజకీయాల చివరి గేమ్లో శరద్ పవార్ ఎలా ఓడిపోయారు? అనే పలు విషయాలను గురించి తెలుసుకుందాం..
Ajaz Khan: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సంచలన విజయం దిశగా దూసుకెళ్తోంది. 288 అసెంబ్లీ స్థానాల్లో 220 కన్నా ఎక్కువ స్థానాలను గెలిచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఒక అంశం ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల్లో వైరల్గా మారింది. ఈ ఎన్నికల్లో వెర్సోవా స్థానం నుంచి పోటీ చేస్తున్న బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్కి ఓటర్లు షాక్ ఇచ్చారు.
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సత్తా చాటింది. రాష్ట్రంలో ఘన విజయం దిశగా వెళ్తోంది. మహాయుతిలోని బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు భారీ విజాయాన్ని అందుకున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 125 సీట్లలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
Maharashtra Election Results: మహారాష్ట్రలో అత్యంత ప్రాధాన్యమున్న పోరులో దక్షిణ ముంబైలోని వర్లీ ఒకటి. ఈ స్థానం నుంచి శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీలో వెనకంజలో ఉన్నారు. శిండే శివసేన నే మిలింద్ దేవరా ఆధిత్యంలో ఉన్నారు. శనివారం ఉదయం 11.30 గంటలకు ఠాక్రే కన్నా కేవలం 600 ఓట్ల మెజారిటీలో దేవరా కొనసాగుతన్నారు. ఇప్పటి వరకు 17 రౌండ్స్లో 5 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి.
Maharashtra Election Results: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తోంది. మహారాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు సాధిస్తోంది. మొత్తం 288 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఏకంగా 218 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సొంతగా బీజేపీ 124 స్థానాల్లో, షిండే సేన 55 స్థానాలు, అజిత్ పవార్ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కేవలం 58 స్థానాల్లో…
Election Results: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు మాత్రం హోరాహోరీని తలపిస్తున్నాయి. క్షణక్షణానికి ఆధిక్యం చేతులు మారుతోంది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ 41. అయితే, బీజేపీ కూటమి, జేఎంఎం+ కాంగ్రెస్ కూటమి మధ్య లీడ్ మారుతోంది.