Airport Customs Rules: విదేశాల్లో నుంచి సుంకం లేకుండా ఎంత బంగారం తెచ్చుకోవచ్చు తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airport Customs Rules: విదేశాల నుంచి భారతదేశానికి ఎంత బంగారాన్ని తీసుకురావచ్చో మీకు తెలుసా?. నియమాల గురించి తెలియకపోతే ఒక రోజు మీరు కస్టమ్స్ గేట్ వద్ద పట్టుబడవచ్చు, ఆ టైంలో మీకు జరిమానా విధించబడుతుంది, సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
- Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
మీకు తెలిసినట్లుగా, ఇప్పటి వరకు రూ.50 వేల వరకు విలువైన వస్తువులను ఇతర దేశాల నుంచి భారతదేశానికి తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని పెంచారు. భారత ప్రభుత్వం బ్యాగేజీ నియమాలు 2026ను రిలీజ్ చేసింది. ఇది ఫిబ్రవరి 2, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఇప్పుడు భారతీయ ప్రయాణికులు ఎటువంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా విదేశాల నుంచి రూ.75 వేల వరకు విలువైన వస్తువులను భారత్కు తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి రూ.50 వేల వరకు మాత్రమే ఉండేది. తాజా నియయాల ద్వారా విదేశాల నుంచి బహుమతులు లేదా ఎలక్ట్రానిక్స్ తీసుకువచ్చే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విమానాశ్రయాలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.
బంగారం, వెండి తీసుకురావడానికి నియమాలు ఇవే..
బంగారం, వెండి తీసుకురావడంలో ఉన్న పరిమితుల గురించి ప్రయాణికులు తరచుగా గందరగోళానికి గురవుతారు. కొత్తగా నోటిఫై చేసిన నియమాల ప్రకారం.. ఇప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉన్న భారతీయ పురుష ప్రయాణికులు 20 గ్రాముల వరకు బంగారాన్ని సుంకం లేకుండా ఇండియాకు తీసుకురావడానికి అనుమతిస్తాయి. అయితే మహిళలకు ఈ మినహాయింపు రెట్టింపు అవుతుంది. మహిళా ప్రయాణికులు ఎటువంటి పన్ను లేకుండా 40 గ్రాముల వరకు బంగారం తీసుకురావచ్చు. పాత నిబంధనలు విమానాశ్రయ తనిఖీ కేంద్రాల సమయంలో గణనీయమైన సమయం వృథాకు కారణమవుతున్నాయని, ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ కొత్త నియమాలు బంగారంపై స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయడానికి, విమానాశ్రయాలలో పొడవైన క్యూలను తొలగించడానికి, ప్రయాణికుల ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. పరిమితిని పెంచినప్పటికీ, ఈ మినహాయింపు కేవలం వ్యక్తిగత వస్తువులు, ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుందని అనేది గుర్తుంచుకోండి. మీరు ఈ పరిమితికి మించి బంగారం లేదా ఇతర వస్తువులను ఇండియాకు తీసుకువస్తే, మీరు దానిని రెడ్ ఛానల్ ద్వారా నివేదించాలి, దానికి వర్తించే కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO: Chiranjeevi – Mega 158: మార్చి నుంచే మెగా జాతర.. చిరు కూతురుగా రూ.1000 కోట్ల హీరోయిన్!
తాజావార్తలు
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!