Airport Customs Rules: విదేశాల్లో నుంచి సుంకం లేకుండా ఎంత బంగారం తెచ్చుకోవచ్చు తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airport Customs Rules: విదేశాల నుంచి భారతదేశానికి ఎంత బంగారాన్ని తీసుకురావచ్చో మీకు తెలుసా?. నియమాల గురించి తెలియకపోతే ఒక రోజు మీరు కస్టమ్స్ గేట్ వద్ద పట్టుబడవచ్చు, ఆ టైంలో మీకు జరిమానా విధించబడుతుంది, సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
- House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
- Gold and Silver Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
మీకు తెలిసినట్లుగా, ఇప్పటి వరకు రూ.50 వేల వరకు విలువైన వస్తువులను ఇతర దేశాల నుంచి భారతదేశానికి తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని పెంచారు. భారత ప్రభుత్వం బ్యాగేజీ నియమాలు 2026ను రిలీజ్ చేసింది. ఇది ఫిబ్రవరి 2, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఇప్పుడు భారతీయ ప్రయాణికులు ఎటువంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా విదేశాల నుంచి రూ.75 వేల వరకు విలువైన వస్తువులను భారత్కు తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి రూ.50 వేల వరకు మాత్రమే ఉండేది. తాజా నియయాల ద్వారా విదేశాల నుంచి బహుమతులు లేదా ఎలక్ట్రానిక్స్ తీసుకువచ్చే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విమానాశ్రయాలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.
బంగారం, వెండి తీసుకురావడానికి నియమాలు ఇవే..
బంగారం, వెండి తీసుకురావడంలో ఉన్న పరిమితుల గురించి ప్రయాణికులు తరచుగా గందరగోళానికి గురవుతారు. కొత్తగా నోటిఫై చేసిన నియమాల ప్రకారం.. ఇప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉన్న భారతీయ పురుష ప్రయాణికులు 20 గ్రాముల వరకు బంగారాన్ని సుంకం లేకుండా ఇండియాకు తీసుకురావడానికి అనుమతిస్తాయి. అయితే మహిళలకు ఈ మినహాయింపు రెట్టింపు అవుతుంది. మహిళా ప్రయాణికులు ఎటువంటి పన్ను లేకుండా 40 గ్రాముల వరకు బంగారం తీసుకురావచ్చు. పాత నిబంధనలు విమానాశ్రయ తనిఖీ కేంద్రాల సమయంలో గణనీయమైన సమయం వృథాకు కారణమవుతున్నాయని, ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ కొత్త నియమాలు బంగారంపై స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయడానికి, విమానాశ్రయాలలో పొడవైన క్యూలను తొలగించడానికి, ప్రయాణికుల ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. పరిమితిని పెంచినప్పటికీ, ఈ మినహాయింపు కేవలం వ్యక్తిగత వస్తువులు, ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుందని అనేది గుర్తుంచుకోండి. మీరు ఈ పరిమితికి మించి బంగారం లేదా ఇతర వస్తువులను ఇండియాకు తీసుకువస్తే, మీరు దానిని రెడ్ ఛానల్ ద్వారా నివేదించాలి, దానికి వర్తించే కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO: Chiranjeevi – Mega 158: మార్చి నుంచే మెగా జాతర.. చిరు కూతురుగా రూ.1000 కోట్ల హీరోయిన్!
తాజావార్తలు
-
Asia Cup 2026: పాకిస్థాన్తో హ్యాండ్షేక్ ఉంటుందా?.. టీమిండియా కోచ్ ఏం చెప్పాడంటే?
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!