Airport Customs Rules: విదేశాల్లో నుంచి సుంకం లేకుండా ఎంత బంగారం తెచ్చుకోవచ్చు తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airport Customs Rules: విదేశాల నుంచి భారతదేశానికి ఎంత బంగారాన్ని తీసుకురావచ్చో మీకు తెలుసా?. నియమాల గురించి తెలియకపోతే ఒక రోజు మీరు కస్టమ్స్ గేట్ వద్ద పట్టుబడవచ్చు, ఆ టైంలో మీకు జరిమానా విధించబడుతుంది, సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా ఎందుకు ఆ నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read
- RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
- Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
మీకు తెలిసినట్లుగా, ఇప్పటి వరకు రూ.50 వేల వరకు విలువైన వస్తువులను ఇతర దేశాల నుంచి భారతదేశానికి తీసుకురావడానికి అనుమతి ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిమితిని పెంచారు. భారత ప్రభుత్వం బ్యాగేజీ నియమాలు 2026ను రిలీజ్ చేసింది. ఇది ఫిబ్రవరి 2, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఇప్పుడు భారతీయ ప్రయాణికులు ఎటువంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా విదేశాల నుంచి రూ.75 వేల వరకు విలువైన వస్తువులను భారత్కు తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి రూ.50 వేల వరకు మాత్రమే ఉండేది. తాజా నియయాల ద్వారా విదేశాల నుంచి బహుమతులు లేదా ఎలక్ట్రానిక్స్ తీసుకువచ్చే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుంది. విమానాశ్రయాలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి, కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ కొత్త నియమాలను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు.
బంగారం, వెండి తీసుకురావడానికి నియమాలు ఇవే..
బంగారం, వెండి తీసుకురావడంలో ఉన్న పరిమితుల గురించి ప్రయాణికులు తరచుగా గందరగోళానికి గురవుతారు. కొత్తగా నోటిఫై చేసిన నియమాల ప్రకారం.. ఇప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం విదేశాలలో ఉన్న భారతీయ పురుష ప్రయాణికులు 20 గ్రాముల వరకు బంగారాన్ని సుంకం లేకుండా ఇండియాకు తీసుకురావడానికి అనుమతిస్తాయి. అయితే మహిళలకు ఈ మినహాయింపు రెట్టింపు అవుతుంది. మహిళా ప్రయాణికులు ఎటువంటి పన్ను లేకుండా 40 గ్రాముల వరకు బంగారం తీసుకురావచ్చు. పాత నిబంధనలు విమానాశ్రయ తనిఖీ కేంద్రాల సమయంలో గణనీయమైన సమయం వృథాకు కారణమవుతున్నాయని, ప్రయాణీకులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ కొత్త నియమాలు బంగారంపై స్పష్టమైన మార్గదర్శకాలు అమలు చేయడానికి, విమానాశ్రయాలలో పొడవైన క్యూలను తొలగించడానికి, ప్రయాణికుల ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తాయని చెబుతున్నారు. పరిమితిని పెంచినప్పటికీ, ఈ మినహాయింపు కేవలం వ్యక్తిగత వస్తువులు, ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుందని అనేది గుర్తుంచుకోండి. మీరు ఈ పరిమితికి మించి బంగారం లేదా ఇతర వస్తువులను ఇండియాకు తీసుకువస్తే, మీరు దానిని రెడ్ ఛానల్ ద్వారా నివేదించాలి, దానికి వర్తించే కస్టమ్స్ సుంకాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO: Chiranjeevi – Mega 158: మార్చి నుంచే మెగా జాతర.. చిరు కూతురుగా రూ.1000 కోట్ల హీరోయిన్!
తాజావార్తలు
-
Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
-
RBI: లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు మీ మొబైల్ ఫోన్ను లాక్ చేస్తుందా? షాకిస్తున్న ఆర్బిఐ కొత్త ప్రతిపాదన
-
Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!