Maharashtra: మహారాష్ట్ర సీఎం ఎవరు..? ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..
- మహారాష్ట్రలో బీజేపీ కూటమి సంచలన విజయం..
- సీఎం ఎవరన్నదానిపై సస్పెన్స్..
- సీఎం పదవిపై ఏక్నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ సత్తా చాటింది. రాష్ట్రంలో ఘన విజయం దిశగా వెళ్తోంది. మహాయుతిలోని బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీలు భారీ విజాయాన్ని అందుకున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి 220కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 125 సీట్లలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
Read Also: Jayamangala VenkataRamana: వైసీపీకి బిగ్షాక్.. పార్టీకి మరో ఎమ్మెల్సీ గుడ్బై..
Also Read
ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ కూటమి విజయం ఖరారవుతున్న సందర్భంలో మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై సస్పెన్స్ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకే పదవి లభిస్తుందా..? లేదా దేవేంద్ర ఫడ్నవీస్కి సీఎం పదవి వస్తుందా.? అనే ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి పదవిపై ప్రస్తుత సీఎం షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీకే సీఎం సీటు ఇవ్వాలనే రూలేం లేదు. అంతిమ ఫలితాలు రానివ్వండి.. మూడు పార్టీలు కలిసి పోటీ చేసినట్లే, మూడు పార్టీల నేతలు సమావేశమై నిర్ణయం తీసుకుంటాం. మా అగ్రనేతలు మోడీ, అమిత్ షాలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం’’ అని చెప్పారు. మేం చేసిన అభివృద్ధిని చూసి మా కూటమికి పట్టం కట్టారని షిండే అన్నారు. ఒక వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధిని చేశామని అన్నారు.
#WATCH | Thane | Maharashtra CM & Shiv Sena leader Eknath Shinde says, "Let the final results come in…Then, in the same way as we fought elections together, all three parties will sit together and take a decision (on who will be the CM)." pic.twitter.com/q6hxe8Wyvn
— ANI (@ANI) November 23, 2024
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?