Maharashtra Election Results: ఇక మహారాష్ట్రలో అదానీ ప్రాజెక్టుకు ఉపశమనం?.. ఏంటా ప్రాజెక్ట్?
- మహారాష్ట్రలో మహాయతి కూటమి ఘన విజయం
- ధారావి ప్రాజెక్టుకు ఉపశమనం
- అధికారంలోకి వస్తే.. అదానీ గ్రూప్కి ఇచ్చిన భూమిని లాక్కుంటామన్న ఉద్ధవ్ ఠాక్రే
- శివసేన (UBT) పరాజయంతో ప్రాజెక్ట్కు వీడిన చిక్కుముడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శివసేన (ఏక్నాథ్ షిండే) మహాయతి కూటమి ఘన విజయం సాధించడంతో బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ $3 బిలియన్ల ధారావి ప్రాజెక్టుకు ఉపశమనం లభించనుంది. దీని కింద ముంబైలోని మురికివాడ ధారవిని ‘ప్రపంచ స్థాయి’ జిల్లాగా పునరాభివృద్ధి పనులు షురూ అవుతాయని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT), అధికారంలోకి వస్తే, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో పునరాభివృద్ధి కోసం అదానీ గ్రూప్కు ఇచ్చిన మొత్తం భూమిని వెనక్కి తీసుకుంటామని, ప్రాజెక్ట్ను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పింది. తాజా ఫలితాల్లో మహాయతి కూటమి విజయంతో ప్రాజెక్టుకు ఉపశమనం లభించనుంది.
READ MORE: Daggubati Purandeswari: ‘హమ్ సాత్ ఏక్ హై’ అనే నినాదంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు..
Also Read
- Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
- Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
కాగా..ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడగా పేరుగాంచిన ధారావిలో రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తం ముగ్గురు బిడ్డర్లలో అత్యధికంగా రూ.5,069 కోట్ల బిడ్ దాఖలు చేయటంతో ఆ ప్రాజెక్టుకు అదానీకే దక్కినట్టు మహారాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి. డీఎల్ఎఫ్ రూ.2,025 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. మూడో బిడ్డర్ నమన్ గ్రూప్ బిడ్కు అర్హత సాధించలేకపోయింది. తుది అనుమతి కోసం బిడ్ వివరాలను ప్రభుత్వానికి పంపుతామని ప్రాజెక్టు సీఈవో ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా, 2.5 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉన్న ధారావి ప్రాంత అభివృద్ధి మొత్తం ప్రాజెక్టు విలువ రూ.20 వేల కోట్లు. ఇందులో భాగంగా అక్కడ నివసిస్తున్న 6.5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టాలి. ఇల్లు సహా ప్రజలకు కావాల్సిన మౌలిక, ఇతర సౌకర్యాలు కల్పించాలి.
READ MORE:Daggubati Purandeswari: ‘హమ్ సాత్ ఏక్ హై’ అనే నినాదంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు..
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!