Maharashtra Election Results: ఇక మహారాష్ట్రలో అదానీ ప్రాజెక్టుకు ఉపశమనం?.. ఏంటా ప్రాజెక్ట్?
- మహారాష్ట్రలో మహాయతి కూటమి ఘన విజయం
- ధారావి ప్రాజెక్టుకు ఉపశమనం
- అధికారంలోకి వస్తే.. అదానీ గ్రూప్కి ఇచ్చిన భూమిని లాక్కుంటామన్న ఉద్ధవ్ ఠాక్రే
- శివసేన (UBT) పరాజయంతో ప్రాజెక్ట్కు వీడిన చిక్కుముడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శివసేన (ఏక్నాథ్ షిండే) మహాయతి కూటమి ఘన విజయం సాధించడంతో బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ $3 బిలియన్ల ధారావి ప్రాజెక్టుకు ఉపశమనం లభించనుంది. దీని కింద ముంబైలోని మురికివాడ ధారవిని ‘ప్రపంచ స్థాయి’ జిల్లాగా పునరాభివృద్ధి పనులు షురూ అవుతాయని వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT), అధికారంలోకి వస్తే, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో పునరాభివృద్ధి కోసం అదానీ గ్రూప్కు ఇచ్చిన మొత్తం భూమిని వెనక్కి తీసుకుంటామని, ప్రాజెక్ట్ను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పింది. తాజా ఫలితాల్లో మహాయతి కూటమి విజయంతో ప్రాజెక్టుకు ఉపశమనం లభించనుంది.
READ MORE: Daggubati Purandeswari: ‘హమ్ సాత్ ఏక్ హై’ అనే నినాదంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు..
Also Read
- Bank Holidays September 2026: సెప్టెంబర్ 2026 బ్యాంక్ సెలవులు ఇవే.. బ్యాంకుకు వెళ్లే ముందు లిస్ట్ చెక్ చేయండి
- September 1, 2026 New Rules: సెప్టెంబర్ 2026 నుంచి కీలక మార్పులు.. ITR, LPG e-KYC, FD రూల్స్ వరకు పూర్తి లిస్ట్ ఇదే
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
కాగా..ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడగా పేరుగాంచిన ధారావిలో రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును అదానీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మొత్తం ముగ్గురు బిడ్డర్లలో అత్యధికంగా రూ.5,069 కోట్ల బిడ్ దాఖలు చేయటంతో ఆ ప్రాజెక్టుకు అదానీకే దక్కినట్టు మహారాష్ట్ర అధికార వర్గాలు వెల్లడించాయి. డీఎల్ఎఫ్ రూ.2,025 కోట్లతో బిడ్ దాఖలు చేసింది. మూడో బిడ్డర్ నమన్ గ్రూప్ బిడ్కు అర్హత సాధించలేకపోయింది. తుది అనుమతి కోసం బిడ్ వివరాలను ప్రభుత్వానికి పంపుతామని ప్రాజెక్టు సీఈవో ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదిలా ఉండగా, 2.5 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉన్న ధారావి ప్రాంత అభివృద్ధి మొత్తం ప్రాజెక్టు విలువ రూ.20 వేల కోట్లు. ఇందులో భాగంగా అక్కడ నివసిస్తున్న 6.5 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి, రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టాలి. ఇల్లు సహా ప్రజలకు కావాల్సిన మౌలిక, ఇతర సౌకర్యాలు కల్పించాలి.
READ MORE:Daggubati Purandeswari: ‘హమ్ సాత్ ఏక్ హై’ అనే నినాదంతో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు..
తాజావార్తలు
-
Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
-
Mamitha Baiju : రెమ్యునరేషన్ పెంచేసిన మమిత బైజు.. రూ. 3 కోట్లు డిమాండ్?
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్ తో రూ.27 కోట్ల వసూళ్లు.. ఊహించని హిట్ అందుకున్న ‘హనుమాన్ అంశ్’
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!