ప్రముఖ కథానాయకుడు విశాల్ కు మద్రాస్ హైకోర్టు నుండి ఊరట లభించింది. విశాల్ నిర్మించిన ‘చక్ర’ సినిమాకు సంబంధించిన వివాదం ఒకటి కొంతకాలంగా కోర్టులో నానుతోంది. ఈ సినిమా దర్శకుడు తొలుత కథను తమకు చెప్పాడని, అది నచ్చి తాము సినిమా నిర్మించడానికి సిద్ధపడిన తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకు ఎక్కింది. అయితే… కోర్టు దీనిని కొట్టేసింది. అంతేకాదు… విశాల్ పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు రూ. 5 లక్షల…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2015లో ధనుష్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారు కొనుగోలు చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నందుకుగాను చెల్లించాల్సిన పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అదే సంవత్సరంలో ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ధనుష్ వేసిన పిటిషన్ను తాజాగా పరిశీలించిన హైకోర్టు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, పన్ను చెల్లించాల్సిందేనని హైకోర్టు ధనుష్ కు తేల్చిచెప్పింది. సామాన్య…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్కి మద్రాస్ హైకోర్టు లక్ష రూపాయల జరిమానాతో షాకిచ్చింది. విజయ్ రోల్స్ రాయిస్ గోస్ట్ అనే రూ.8 కోట్ల ఖరీదైన కారును 2012లో ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కారుకు దాదాపు రూ.1.6 కోట్లను పన్నుగా చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ హీరో విజయ్ 2021లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా, విజయ్ పిటిషన్ ను జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియమ్ తోసిపుచ్చారు.…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై పెద్ద చర్చే జరిగింది.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. ఆ మందను పరిశీలించడం.. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడం.. ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, తాజాగా.. ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది మద్రాసు హైకోర్టు.. ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్…