Actor Vishal: విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court Gives Shock To Vishal: తమిళ హీరో విశాల్కు ఒక కేసులో మద్రాస్ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. మూడు వారాల్లోపు రూ.15 కోట్లు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, లేకపోతే తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కాకుండా నిషేధం విధించడం జరుగుతుందని షాకింగ్ తీర్పునిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్తో కుదుర్చుకున్న ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించిన కేసులో.. మద్రాస్ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. దీంతో.. అతడు కోర్టు విధించిన గడువులోపు రూ.15 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అసలేం జరిగిందంటే..
Dowry: నీ బిడ్డ చనిపోయింది శవాన్ని తీసుకెళ్లండి.. అత్తకు అల్లుడు ఫోన్
Also Read
- Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
- Item Songs: బాలీవుడ్లో తొలి ఐటమ్ సాంగ్ ఏది?.. ఈ ట్రెండ్ ఎలా మొదలైందో తెలుసా?
- AK47: వెంకీ కూతురిగా యువినా.. 'AK47' నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
- Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
విశాల్ గతంలో తన నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ కోసం.. అన్బుచెళియన్ అనే ఫైనాన్షియర్ వద్ద నుంచి రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. నిర్ణీత సమయంలో ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేంత డబ్బు లేకపోవడంతో.. లైకా ప్రొడక్షన్స్ని సంప్రదించాడు. తన అప్పు తీరిస్తే.. అది చెల్లించేంత వరకు తన సినిమాల పంపిణీ హక్కుల్ని ఇస్తానని లైకా ప్రొడక్షన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో.. అతని అప్పుని ఆ సంస్థ తీర్చింది. ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి.. విశాల్ తన సినిమాల పంపిణీ హక్కుల్ని లైకా సంస్థను ఇస్తూ వస్తున్నాడు. కానీ.. కొంతకాలం క్రితం ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘిస్తూ, తన ‘వీరమే వాగై సూడుం’ సినిమాని రిలీజ్ చేశాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
Khushboo Sundar: ఆసుపత్రిపాలైన ఖుష్బూ.. అది చాలా చెడ్డదంటూ పోస్ట్
ఈ కేసుని విచారించిన సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు.. రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్ చేయాలని విశాల్కు ఆదేశించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టులో అప్పీల్ చేయగా.. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపింది. రూ.15 కోట్లు విశాల్ చెల్లించాలంటూ సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అంతేకాదు.. ప్రత్యేక జడ్జి తన తుది తీర్పును వెలువరించేంత దాకా, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే సినిమాలను థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీలులేదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
-
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
-
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
-
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!