Actor Vishal: విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మూడు వారాల్లో రూ.15 కోట్లు కట్టాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court Gives Shock To Vishal: తమిళ హీరో విశాల్కు ఒక కేసులో మద్రాస్ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. మూడు వారాల్లోపు రూ.15 కోట్లు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని, లేకపోతే తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కాకుండా నిషేధం విధించడం జరుగుతుందని షాకింగ్ తీర్పునిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్తో కుదుర్చుకున్న ఒక ఒప్పందాన్ని ఉల్లంఘించిన కేసులో.. మద్రాస్ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. దీంతో.. అతడు కోర్టు విధించిన గడువులోపు రూ.15 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అసలేం జరిగిందంటే..
Dowry: నీ బిడ్డ చనిపోయింది శవాన్ని తీసుకెళ్లండి.. అత్తకు అల్లుడు ఫోన్
Also Read
- Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి... ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ....
- Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు... ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
- Dhurandhar: 'ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
- Gossip: పబ్ సాంగ్తో రాశి సింగ్ రచ్చ.. ఊపేస్తున్న ‘గాసిప్’ ఫస్ట్ సింగిల్
విశాల్ గతంలో తన నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీ కోసం.. అన్బుచెళియన్ అనే ఫైనాన్షియర్ వద్ద నుంచి రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. నిర్ణీత సమయంలో ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేంత డబ్బు లేకపోవడంతో.. లైకా ప్రొడక్షన్స్ని సంప్రదించాడు. తన అప్పు తీరిస్తే.. అది చెల్లించేంత వరకు తన సినిమాల పంపిణీ హక్కుల్ని ఇస్తానని లైకా ప్రొడక్షన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో.. అతని అప్పుని ఆ సంస్థ తీర్చింది. ఈ ఒప్పందం కుదిరినప్పటి నుంచి.. విశాల్ తన సినిమాల పంపిణీ హక్కుల్ని లైకా సంస్థను ఇస్తూ వస్తున్నాడు. కానీ.. కొంతకాలం క్రితం ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘిస్తూ, తన ‘వీరమే వాగై సూడుం’ సినిమాని రిలీజ్ చేశాడు. దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
Khushboo Sundar: ఆసుపత్రిపాలైన ఖుష్బూ.. అది చాలా చెడ్డదంటూ పోస్ట్
ఈ కేసుని విచారించిన సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు.. రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్ చేయాలని విశాల్కు ఆదేశించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టులో అప్పీల్ చేయగా.. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపింది. రూ.15 కోట్లు విశాల్ చెల్లించాలంటూ సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. అంతేకాదు.. ప్రత్యేక జడ్జి తన తుది తీర్పును వెలువరించేంత దాకా, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే సినిమాలను థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీలులేదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..