Madras High Court: రక్తనమూనాలతో లైంగిక పటుత్వ పరీక్ష.. టూ ఫింగర్ టెస్టును తొలగించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court: లైంగిక పటుత్వ పరీక్ష(పొటెన్సీ టెస్ట్)కు అనుసరిస్తున్న విధానాల్లో మార్పు తీసుకురావాలని మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సైన్స్ అభివృద్ధి చెందిందని, వీర్య నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదని, కేవలం నిందితుడి రక్తనమూనాలను ఉపయోగించి పొటెన్సీ టెస్ట్ నిర్వహించేందుకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని అధికారులకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
టూ ఫింగర్ టెస్ట్ నిలిపివేయబడుతుందని నిర్ధారించుకోవాల్సి అసవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం, జువైనల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్) చట్టం అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటైన న్యాయమూర్తులు ఎన్ ఆనంద్ వెంకటేష్, సుందర్ మోహన్లతో కూడిన డివిజన్ బెంచ్ జూలై 7న ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మైనర్ బాలిక మరియు అబ్బాయికి సంబంధించిన హెబియస్ కార్పస్ పిటిషన్ను కూడా ధర్మాసనం విచారిస్తున్న క్రమంలో ఈ ఆదేశాలు ఇచ్చింది.
Also Read
- Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
మద్రాస్ హైకోర్ట్ బెంచ్..‘‘ మేము టూ ఫింగర్ టెస్ట్ పరీక్ష, ఆర్కైక్ పొటెన్సీ టెస్టు నిలిపివేయబడతాయని నిర్ధారించుకోవాలని అనుకుంటున్నాము. వివిధ జోన్ల ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కు సూచనల ద్వారా డేటాను సేకరించమని ఆదేశించాలని డీజీపీని ఆదేశించాం. జనవరి 1, 2023 నుంచి ప్రారంభమయ్యే అన్ని కేసుల్లో లైంగిక నేరానికి సంబంధించి మెడికల్ రిపోర్టులు తయారుచేయబడుతాయి. ఏదైనా పరీక్షలో టూ ఫింగర్ టెస్ట్ ఉందో లేదో చూడండి. అటువంటి నివేదిక ఏదైనా గుర్తించబడితే, అది కోర్టు దృష్టికి తీసుకురాబడుతుంది, దాన్ని మేము స్వీకరించి తరుపరి ఉత్తర్వులు జారీ చేస్తాం.
అలాగే లైంగిక నేరాల్లో నేరస్థుడికి నిర్వహిస్తున్న స్పెర్మ్ సేకరించే విధానం గతంలో నిర్వహించే పద్దతి. సైన్స్ ప్రస్తుతం కాలంలో చాలా అభివృద్ధి చెందింది. కేవలం రక్తనమూనాల ద్వారా ఈ పరీక్ష నిర్వహించడం సాధ్యమవుతుంది. ఇటువంటి అధునాతన పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా అనుసరించబడుతున్నాయి. మనం కూడా అభివృద్ధి చెందాలి. రక్తనమూనాలను సేకరించడం ద్వారా పొటెన్సీ టెస్ట్ నిర్వహించడం కోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించాలి.’’ అని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 11కి ధర్మాసనం వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!