High Court: విద్యార్థులు జీవితాన్ని అంతం చేసుకుంటే ఉపాధ్యాయులను మాత్రమే నిందించొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court: విద్యార్థి తన జీవితాన్ని అంతం చేసుకునేందుకు తీవ్ర చర్యలు తీసుకుంటే ఉపాధ్యాయులను మాత్రమే నిందించకూడదని, వారి భవిష్యత్తును రూపొందించడంలో తల్లిదండ్రులు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తారని మద్రాసు హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది.తమ పిల్లలకు ఇంటి లోపల, వెలుపల మంచి వాతావరణాన్ని సృష్టించే బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, ఇది చాలా ముఖ్యమైనదని కోర్టు తెలిపింది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఏదైనా నేరం చేసినట్లు లేదా పాఠశాల విద్యా శాఖ జారీ చేసిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు నిర్ధారించడానికి ఆధారాలు ఉంటే మాత్రమే వారిని నిందించవచ్చు అని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చిన్నారులు ఆత్మహత్యలు చేసుకునే ట్రెండ్ పెరిగిపోయింది. కావున వారి విధులను సక్రమంగా నిర్వహించి పిల్లలకు మంచి భవిష్యత్ను అందించడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విధి అని జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం అన్నారు.
తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడినందుకు గాను, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై రూ.10 లక్షల నష్టపరిహారంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కె.కాలా చేసిన రిట్ పిటిషన్ను బెంచ్ కొట్టివేసింది. పిటిషనర్ ప్రకారం.. రోజూవారీ కూలీలైన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి కుమారుడు యువరాజ్ (17) గూడలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తమ కుమారుడిని వేధించినట్లు.. ఆ వేధింపుల వల్లే తన కుమారుడు 2017లో ఆత్మహత్య చేసుకున్నాడని బాలుడి తల్లి వాదించింది. పిల్లల ఆత్మహత్య ఎవరు బాధ్యులు అని విచారణ చేపట్టి నిర్ధారించాలని న్యాయమూర్తి చెప్పారు. కేవలం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను నిందించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది.
Also Read
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
- Green SM Limo: ఓలా-ఉబర్లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
Delhi: ఢిల్లీలో తీవ్రమవుతున్న వాయుకాలుష్యం.. వాణిజ్య డీజిల్ ట్రక్కులపై నిషేధం
ఈ కేసులో విద్యాశాఖ, పోలీసు అధికారులు ఇద్దరూ విస్తృతమైన విచారణ జరిపి, వారి సంబంధిత నివేదికలను సమర్పించారు. బాలుడు ఆత్మహత్యకు పాల్పడినందుకు ప్రధానోపాధ్యాయుడు ఎటువంటి ప్రాసిక్యూషన్కు బాధ్యత వహించడు. అందువల్ల ఎటువంటి సరైన కారణం లేకుండా ప్రధానోపాధ్యాయుడిని అనవసరంగా లాగి బాధపెట్టారని, పిటిషనర్కు జరిమానా విధించడమే సరైనదని న్యాయమూర్తి అన్నారు. పిటిషనర్, ఆమె కుటుంబం పేద దుస్థితిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి అలా చేయడం మానుకున్నారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..