Panneerselvam: పన్నీర్ సెల్వంకు షాక్.. 11 ఏళ్ల తర్వాత ఆ కేసు పునర్విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court Reopens corruption Case against former CM Panneerselvam: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు షాక్ తగిలింది. 11 ఏళ్ల తర్వాత అక్రమ సంపాదన కేసు పునర్విచారణను సుమోటోగా స్వీకరించింది మద్రాస్ హైకోర్టు. వివరాల ప్రకారం.. 2001-06 మధ్య కాలంలో దివంగత జయలలిత ప్రభుత్వంలో పన్నీర్ సెల్వం రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. రూ. 1.77 కోట్ల మేర అక్రమంగా సంపాదించారంటూ 2006లో అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే 2011లో అన్నాడీఎంకే మళ్లీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. దీంతో అక్రమార్జన కేసుపై విచారణ జరిపేందుకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
Also Read: Viral Video: ఆసుపత్రిలో తుపాకీతో కాల్పులు.. వైరల్ వీడియో
Also Read
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
అయితే ఈ నేపథ్యంలోనే నిందుతులపై ఉన్న ఆరోపణలు రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారాలు లభించడం లేదంటూ ఏసీబీ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో శివగంగ కోర్టు 2012లో ఈ కేసులో ఛార్జిషీట్ దఖాలైన వారందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో పన్నీర్ సెల్వంతో పాటు ఆయన భార్య విజయలక్ష్మి, కుమారుడు రవీంద్రనాథ్ లతో పాటు ఆరగురిపై ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. అయితే ఏసీబీ విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వీరు కేసు నుంచి బయటపడ్డారు. అయితే 11 ఏళ్ల తరువాత ఈ కేసును సుమోటాగా తీసుకొని పునర్విచారించేందుకు మద్రాస్ హైకోర్టు సిద్దమయ్యింది.
ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన ఏసీబీ, దిగువ కోర్టులపై కూడా ఉన్నత న్యాయస్థానం ఫైర్ అయ్యింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పక్షాలపై కేసులు పెట్టడం మళ్లీ ప్రతిపక్షాలు అధికారంలోకి రాగానే ఆ కేసులు లేకుండా చేసుకోవడం రాష్ట్ర రాజకీయాలలో అలవాటుగా మారిపోందని, ఈ విషయంలో అవినీతి విచారణ సంస్థలు కూడా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇక దిగువ కోర్టుల తీర్పుపై 12 ఏళ్లు గడిచినా పునర్విచారణ జరిపేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని… ఆ ఉత్తర్వులకు అనుగుణంగానే పన్నీర్ సెల్వం కేసుపై పునర్విచారణ జరుపుతామని కోర్టు పేర్కొంది. దీంతో పన్నీర్ సెల్వం మరోసారి చిక్కుల్లో పడినట్లు అయ్యింది.
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!