Viral Video: బుధవారం రాత్రి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని న్యూ మినల్ రెసిడెన్సీ వద్ద ఇద్దరు మద్యం మత్తులో ఉన్న యువకులు అపార్ట్మెంట్లోకి చొరబడి 20 ఏళ్ల యువతిపై దాడి చేశారు. ఆమె అరుపులు విన్న ఆమె సోదరుడు తన గదిలో నుంచి బయటకు వచ్చి నిందితుడితో గొడవకు దిగాడు. నిందితులు మహిళకు ఇరుగుపొరుగు వారు కావడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. నిందితులు యువకులు పక్క ఫ్లాట్లో నివసిస్తున్నారు. UP Teacher: మహిళా టీచర్ని…
English Teacher: మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని మహిళా ఇంగ్లీష్ టీచర్ ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే 19 ఏళ్ల యువ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
Borewell Incident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని కసర్ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పుట్టిన రోజునే బాలిక బోరుబావిలో పడిపోవడంతో కుటుంబం కన్నీరుమున్నీరు అవుతోంది.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరిఫ్ అకిల్ కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరిఫ్ అకిల్ భోపాల్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
MP Shocker: మధ్యప్రదేశ్ రేవాలో జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. 13 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల చెల్లిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. పోర్న్ చూసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి, పక్కనే పడుకున్న సోదరిపై అత్యాచారం చేశాడు.
MP Shocker: ఇటీవల కాలంలో ఇంటర్నెట్లో ‘పోర్న్’ విపరీతంగా చూడటం నేరాలకు కారణమవుతోంది. మైనర్లు అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గడం కూడా పోర్న్ అడిక్షన్ని పెంచుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఈ జాఢ్యం ఎంతలా పెరిగిందనే విషయాన్ని తెలియజేస్తోంది.
బెంగళూరు హాస్టల్లో 22 ఏళ్ల యువతి హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువకుడు అర్ధరాత్రి వసతి గృహంలోకి ప్రవేశించి.. యువతిని అత్యంత దారుణంగా పొడిచి.. పీక కోసి చంపేశాడు.
మధ్యప్రదేశ్లోని సాగర్లో విషాదం చోటు చేసుకుంది. గోరఖ్పూర్ నుంచి పూణే వెళ్తున్న పూణె వీక్లీ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్లోని ప్రయాణికులపై వేడి వేడి 'టీ' పడటంతో గందరగోళం నెలకొంది. ముగ్గురు ప్రయాణీకులపై టీ పడటంతో.. వారు ప్రయాణించే కోచ్ అల్లకల్లోలం అయింది. తమపై 'టీ' పడటంతో చాలా ఇబ్బందిగా, నొప్పిగి ఉందంటూ.. కోచ్ లో నెట్టడం, లాగడం చేశారు. ఈ గందరగోళంలో డోర్ వద్ద కూర్చున్న ఇద్దరు ప్రయాణికులకు తగలడంతో కదులుతున్న రైలు నుండి జారి పడిపోయారు
చాలా మంది జీవితం బాగుపడాలంటే అదృష్టం కలిసి రావాలంటారు. ఇది సరదాగా అంటారో లేదంటే నిజంగానే అంటారో తెలియదు గానీ.. ఓ కార్మికుడి పట్ల ఇది అక్షరాల నిజమైంది. మధ్యప్రదేశ్కు చెందిన కార్మికుడికి రూ.80 లక్షల విలువైన వజ్రం దొరికింది. దీంతో అతడి కుటుంబ సభ్యులంతా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు.
మధ్యప్రదేశ్లో ఘోరం జరిగింది. కలకాలం తోడుగా ఉండాల్సి భర్తే కాలయముడయ్యాడు. గర్భిణీగా ఉన్న భార్యను ముక్కలు ముక్కులుగా నరికి సజీవదహనం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.