MP Shocker: చెల్లిపై అత్యాచారం, తల్లి ముందే హత్య.. ఎంపీ ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు..
- మధ్యప్రదేశ్ అత్యాచార ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు..
- చెల్లిలిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం..
- తల్లి ముందే గొంతు నులిమి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Shocker: మధ్యప్రదేశ్ రేవాలో జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపుతోంది. 13 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల చెల్లిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. పోర్న్ చూసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూసి, పక్కనే పడుకున్న సోదరిపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతారని చెప్పడంతో హత్య చేశాడు. ఏప్రిల్ 24న జరిగిన ఈ ఘటనలో అనుమానితుల డీఎన్ఏలను పోలీసులు విశ్లేషించగా, చివరకు బాలిక ప్రైవేట్ పార్టులోని స్పెర్మ్ నిందితుడితో మ్యాచ్ అయింది. ఈ కేసులో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు.
Read Also: Rahul Gandhi : ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ప్రమాదం.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఈ ఘటనలో దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే, ఈ కేసులో బాలుడిని రక్షించేందుకు తల్లితో పాటు అతడి ఇద్దరు అక్కలు అతడికి సహకరించారు. ‘‘ఏప్రిల్ 24న జావా పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, గొంతు కోసి చంపారు, ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి మృతదేహం ఆమె ఉన్న ఇంటి ప్రాంగణంలో కనుగొనబడింది. బాలిక నిద్రపోయిన సమయంలో ఈ ఘటన జరిగింది’’ అని ఎస్పీ వివేక్ సింగ్ చెప్పారు.
13 ఏళ్ల బాలుడిని అతడి తల్లి, 17, 18 ఏళ్లు ఉన్న ఇద్దరు అక్కలు రక్షించే ప్రయత్నం చేశారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు సాయం చేసినట్లు అంగీకరించారు. బాలిక హత్య తర్వాత తన తల్లికి విషయం చెప్పాడు. అప్పటికే మేల్కొన్న ఇద్దరు అక్కలు దర్యాప్తుని తప్పుదారి పట్టించేందుకు బెడ్పై మరకల్ని తొలగించారు. దర్యాప్తుని తప్పుదారి పట్టించేందుకు బాలికను విషపు పురుగు కరించిందని వారు పేర్కొన్నారు. ఆమె మృతదేహాన్ని ప్రైవేట్ వైద్యుడి వద్దకు కూడా తీసుకెళ్లారు. చివరకు ప్రభుత్వం వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, బాలికపై అత్యాచారం, హత్య జరిగిందని తెలిపాడు. ఈ కేసులో దాదాపు 50 మందిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!