Lok Sabha Election 2024 : దేశంలో లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఎన్నికల సంఘం కూడా శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. అప్పుడు వచ్చే ఐదేళ్లపాటు అధికార పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండాలో దేశ ప్రజల ఓటు నిర్ణయిస్తుంది.
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పర్యటించారు. జనసేన మండల నాయకులతో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం అవకాశం ఇస్తే విశాఖ ఎంపీగా పోటీ చేస్తానన్నారు. జనసేన-టీడీపీతో పొత్తుపై మా అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్తో పొత్తు విషయంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో సీపీఎం రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని తమ్మినేని తెలిపారు. లోక్ సభలో కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా లేదా అనేది కాంగ్రెస్ తేల్చాలి అని అన్నారు. కాంగ్రెస్తో పొత్తు ఉండాలని ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. కమ్యునిస్టులతో కలిసి పనిచేయాలని…
బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లేని అంశాలను కావాలని తెరమీదకు తెస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు.
పంజాబ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి విజయం నమోదు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన తర్వాత పంజాబ్లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తుపై సందేహం నెలకొంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ రాష్ట్ర విభాగం నిరంతరం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో.. పంజాబ్ కాంగ్రెస్కు చెందిన పలువురు నేతలు ఆప్తో…
ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతర వాస్తవాలను పసిగట్టిన కాంగ్రెస్ ఇప్పుడు సీట్ల పంపకాల ప్రక్రియను వేగవంతం చేసే విషయంలో అనువైన వైఖరిని అవలంబించాలని సూచిస్తోంది. డిసెంబర్ 19న జరిగే సమావేశంలో ఇండియా కూటమి నేతల మధ్య లోక్సభ సీట్ల పంపకంపై విస్తృత ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది.
General election-2024: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు డిసెంబర్ 21న కాంగ్రెస్ కీలక భేటీకి పిలుపునిచ్చింది. బీజేపీని ఢీకొట్టేందుకు, ఎన్నికల ప్రచారాన్ని రంగంలోకి దించేందుకు ప్రణాళికలను రూపొందించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Suresh Gopi: మళయాల స్టార్ హీరో కమ్ పొలిటిషయన్ సురేష్ గోపి వివాదంలో చిక్కుకున్నారు. కేరళలోని కోజికోడ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుపై అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(కేయూడబ్ల్యూజే) అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇంధన ధరలు తగ్గుతాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇది మీడియా ప్రచారం అని, అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.
Mamata Banerjee: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరుగుతాయని.. బీజేపీ ప్రభుత్వం మరో 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. జూలై 8న పశ్చిమ బెంగాల్ లో జరగే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. జల్పైగురి జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ..