Fuel Prices: లోక్సభ ఎన్నికలకు ముందు ఇంధన ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి ఏం అన్నారంటే?
Fuel Prices: ఇంధన ధరలపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఇంధన ధరలు తగ్గుతాయా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇది మీడియా ప్రచారం అని, అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గిస్తారనడం అపోహ అని అన్నారు. అంతర్జాతీయ ధరలు, రవాణా ఖర్చులు, రిఫైనింగ్ ఖర్చులు, పన్నులు వంటి అనేక అంశాలు ఇంధన ధరలను నిర్దేశిస్తున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. ఇలాంటి అంశాలను ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందనే దానిపైనే దేశంలో ఇంధన ధరలు నిర్ణయిస్తాయని అన్నారు.
Read Also: Madhyapradesh: ఖజురహో-ఉదయ్పూర్ ఇంటర్సిటీ రైలు ఇంజిన్లో మంటలు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
కరోనా మహమ్మారి తర్వాత 2022లో చమురు ధరలు పెరిగాయని, చమురు సరఫరా చేసే దేశాలను తమ ధరలను తగ్గించమని భారతదేశం అడగలేదని అన్నారు. బదులుగా ధరలను తగ్గించడానికి ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందన్నారు. అంతేకాకుండా బీజెపి పాలిత రాష్ట్రాల్లో, ప్రభుత్వం ఇంధనంపై విలువ ఆధారిత పన్నును తగ్గించిందని, ధరలను రూ. 8 నుండి రూ. 11 వరకు తగ్గించిందని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రిని ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ గురించి కూడా అడిగారు. ప్రతిస్పందనగా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో జరిగిన సంభాషణను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇందులో ఆప్ నాయకుడు రాజవంశ రాజకీయాలకు వ్యతిరేకమని అన్నారు.
Read Also: Boys Hostel: రేయ్ ఎవర్రా మీరంతా.. రష్మీ అందాన్ని పక్కన పెట్టి రక్తం అలా తాగేస్తున్నారు?
ప్రతిపక్ష కూటమిలో ఎందుకు భాగమయ్యారని కేజ్రీవాల్ను ప్రశ్నించగా, అది కేవలం రాజకీయం మాత్రమేనని ఆప్ నేత చెప్పారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. ఈ ఏడాది G20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం గురించి పూరి మాట్లాడుతూ, “అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారతదేశ అనుభవం చాలా ఔచిత్యాన్ని కలిగి ఉంది” అని అన్నారు. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ప్రారంభమైన మెట్రో రైలు వ్యవస్థ చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా అవతరించనుందని చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!