General election-2024: ఈ నెల 21న కాంగ్రెస్ కీలక భేటీ.. రాహుల్ గాంధీ యాత్రపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
General election-2024: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. లోక్సభ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో.. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు డిసెంబర్ 21న కాంగ్రెస్ కీలక భేటీకి పిలుపునిచ్చింది. బీజేపీని ఢీకొట్టేందుకు, ఎన్నికల ప్రచారాన్ని రంగంలోకి దించేందుకు ప్రణాళికలను రూపొందించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: Parliament Attack: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన.. నిందితుల కాలిపోయిన ఫోన్లు, దుస్తులు స్వాధీనం..
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. డిసెంబర్ 19న ఇండియా కూటమి సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత కాంగ్రెస్ భేటీ కానుంది. ఇండియా కూటమి సమావేశంలో రాజకీయ పార్టీల మధ్య సీట్ల పంపకం, ప్రచారం ఎజెండా గురించి చర్చించనున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధానాంశాలుగా 2024 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మరోసారి యాత్ర నిర్వహించే విషయంపై డిసెంబర్ 21 సమావేశంలో చర్చించనున్నారు.
గతేడాది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’ సక్సెస్ అయింది. అయితే లోక్ సభ ఎన్నికల ముందు ఈసారి తూర్పు నుంచి పశ్చిమం వైపు హైబ్రీడ్ మోడ్లో యాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాలుగా ఉన్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం తెలంగాణలో మాత్రమే అధికారం దక్కించుకుంది. ఈ సమావేశంలో ఓటమి అంశాలను కూడా విశ్లేషించనుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!