Lightning Strike on Fuel Tank: లాటిన్ అమెరికా దేశం క్యూబాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. చమురు నిల్వ కేంద్రంపై పిడుగుపాటుకు గురవ్వడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు అధికార లెక్కల ప్రకారం ఒకరు మరణించగా.. 121 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. 17 మంది అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయారు. ఇంధన నిల్వ కేంద్రం చుట్టు పక్కల ఉన్న 1900 మందిని సురక్షితన ప్రాంతాలకు…
Lightning Strike In Uttar pradesh, Madhya pradesh: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటులో పలువురు మరణించారు. మధ్యప్రదేశ్ లోని విదిశా, సత్నా, గుణ జిల్లాల్లో గత 24 గంటల్లో 9 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని గంజ్ బాసోడా తహసీల్ పరిధిలోని అగసోడ్ గ్రామంలో వర్షం వస్తుందని చెట్టుకింద నిల్చున్న నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. దీంతో వారంతా అక్కడిక్కడే మరణించారు. చ
క్యూబాలోని మతాంజాస్ నగరంలోని చమురు నిల్వ కేంద్రంలో పిడుగు పడింది. ఈ పిడుగుపాటు వల్ల భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు 80 మంది గాయపడ్డారు. మంటలార్పేందుకు వచ్చిన 17 మంది అగ్నిమాపక సిబ్బంది అదృశ్యమయ్యారు.
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్కు సమీపంలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మరణించారు. తమ 56వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వృద్ధ జంటతో సహా ముగ్గురు వ్యక్తులు శుక్రవారం వైట్హౌస్ సమీపంలోని పార్కులో పిడుగుపాటుకు గురై మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది… అయితే, కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు బలి అయ్యారు.. ఆదోని మండలం కుప్పగల్లో పిడుగు పడి కనిగిని ఉరుకుంధమ్మ (33), కనిగిని లక్ష్మమ్మ (39) ఇద్దరు మహిళలు మృతిచెందారు.. ఇక, హోళగొంద మండలం వండవాగిలిలో పంట పొలం పనులు చేస్తుండగా పిడుగుపాటుకు తాయన్న, చంద్రన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు విడిచారు.. అధిక ఉష్ణోగ్రతలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ వాసులకు చల్లని కబురుతో వర్షాలు కురుస్తున్నామ..…