Lightning Strike: చమురు నిల్వ కేంద్రంలో పిడుగు.. 80 మందికి గాయాలు, 17మంది మిస్సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning Strike: క్యూబాలోని మతాంజాస్ నగరంలోని చమురు నిల్వ కేంద్రంలో పిడుగు పడింది. ఈ పిడుగుపాటు వల్ల భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు 80 మంది గాయపడ్డారు. మంటలార్పేందుకు వచ్చిన 17 మంది అగ్నిమాపక సిబ్బంది అదృశ్యమయ్యారు. దేశ ఇంధన, గనుల మంత్రిత్వ శాఖ ప్రకారం.. శుక్రవారం రాత్రి ఉరుములతో కూడిన గాలివాన సమయంలో మతాంజస్ సూపర్ట్యాంకర్ బేస్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇంకా ప్రయత్నిస్తున్నారని సీబీఎస్ న్యూస్ నివేదించింది. చమురు రంగంలో అనుభవం ఉన్న అంతర్జాతీయ నిపుణుల నుంచి క్యూబా ప్రభుత్వం తర్వాత తెలిపింది.
పిడుగు ఓ ట్యాంక్పై పడడంపై మంటలు చెలరేగాయని.. అనంతరం మరో ట్యాంక్కు వ్యాపించాయని.. ఇలా భారీగా మంటలు చెలరేగాయని అధికారిక క్యూబన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఆ ప్రాంతంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు మిలిటరీ హెలికాప్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ ప్రాంతంలో దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ట్యాంకులపై నీటిని చల్లుతూ తీవ్రంగా శ్రమిస్తున్నారని మతాంజస్లోని అగ్నిమాపక కార్యకలాపాల అధిపతి రాబర్టో డి లా టోర్రే వెల్లడించారు.
Also Read
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
Uttar Pradesh: కక్కుర్తి పడి టాటూస్ వేయించుకున్నారు.. హెచ్ఐవీ కొని తెచ్చుకున్నారు.
గాయపడిన వారి సంఖ్య 77కి చేరుకుందని, 17 మంది తప్పిపోయారని తెలిసింది. ఆ ప్రాంతంలో మంటలార్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న 17 మంది అగ్నిమాపక సిబ్బంది తప్పిపోయినట్లు ఓ అధికారి వెల్లడించారు. గాయపడిన వారిలో ఏడుగురిని హవానాలోని కాలిక్స్టో గార్సియా ఆసుపత్రికి తరలించారు. క్యూబా ఇంధన కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరిస్థితి ఇంకా విషమిస్తుండడంతో విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలకు ఇంధనంగా ఉపయోగించే ఎనిమిది జెయింట్ ట్యాంక్లను కలిగి ఉన్న స్టోరేజీ ఫెసిలిటీలో ఎంత చమురు కాలిపోయింది అనే దానిపై తక్షణ సమాచారం లేదు. అధికారుల ప్రకారం.. అగ్నిప్రమాదానికి దగ్గరగా ఉన్న డుబ్రోక్ పరిసరాలను ఖాళీ చేయించారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!