Home
Leopard
Leopard News
-
తిరుమలలో చిరుత కలకలం.. సైరన్ మోగించిన సిబ్బంది
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. కరోనా కారణంగా గతంలో భక్తులు తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు క్రమేపీ భక్తులు పెరుగుతున్నారు. తాజాగా తిరుమలలో కలకలం రేగింది. రెండవ ఘాట్ రోడ్డులో మరోసారి చిరుత కనిపించడంతో అలజడి కలిగింది. ఘాట్ రోడ్డులోని ఆఖరి మలుపు వద్ద చిరుత సంచరించింది. ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు ముగించుకుని తిరుమలకు వస్తున్న కార్మికులకు కనపడింది చిరుత. దానిని చూసి విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు కార్మికులు. వెంటనే ఘటన… -
నల్లమల్లలో ఆగని వన్యప్రాణుల వేట..
ప్రభుత్వాలు ఎన్ని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చినా వన్యప్రాణులను వేటగాళ్ల భారీ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వేటగాళ్లు మాత్రం తమ దారిలోనే అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణపై తీసుకునే రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వేటగాళ్ల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు చివరి దశకు చేరుకున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడుకుని భవిష్యత్ తరాలకు వాటిని… -
ఆ దర్శన టికెట్లు రీషెడ్యూల్ చేసుకోవచ్చు
తిరుమలలో కొండ చరియలు విరిగిపడడం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోలేని భక్తులకు మరో అవకాశం కల్పించింది టీటీడీ. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. భక్తులకు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు. నవంబర్ 18 నుంచి డిసెంబరు 10వ తేది వరకు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా తేదీల్లో దర్శనం టికెట్లు వున్న భక్తులు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.… -
బాబోయ్ పులి.. కార్తిక స్నానానికి వెళ్ళి పరుగులు
చిరుతపులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహేగాం మండలం లోహ శివారులో పులి సంచారం గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసింది. మూడు వాగుల వద్ద కార్తిక స్నానానికి వెళ్ళిన 20 మంది భక్తులు పరుగులు తీశారు. వారికి పులి ఎదురుపడింది, పులి కదలకపోవడంతో అక్కడే ఆగిపోయారు భక్తులు. పులి కనిపించిన సమాచారాన్ని ఊరిలో ఉన్నవారికి సమాచారం ఇవ్వడంతో వారంతా కదిలి వచ్చారు. గ్రామస్తులు డప్పులు వాయిస్తూ వెళ్ళడంతో పులిక పారిపోయింది. పులి కనిపించిన సమాచారాన్ని అటవీశాఖ… -
సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం.. రైతుల్లో భయం
తెలంగాణలో చిరుతలు అలజడి కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక జిల్లాలో చిరుతలు నడిరోడ్లపైకి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం నగాధర్ శివారులో చిరుత పులి తిరుగుతున్నట్టు రైతులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత పులి కదలికలను రైతులు విడుదల చేయడంలో సమీపంలోని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రైతు రామయ్య కు చెందిన లేగదూడను చంపేసింది ఆ చిరుత పులి. కల్హేరు సిర్గాపూర్… -
తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత కలకలం…
కరోనా లాక్డౌన్ సమయంలో తిరుమల ఘాట్ రోడ్లపై చిరుతలు, పులులు స్వేచ్ఛగా విహరించాయి. జనసంచారం లేకపోవడంతో వన్యప్రాణులు రోడ్లమీదకు వచ్చి కనువిందు చేశాయి. అయితే, కరోనా తరువాత ఇప్పుడు తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో చిరుతలు రోడ్లమీదకు రావడంలేదు. అయితే, ఆదివారం అర్థరాత్రి సమయంలో తిరుమత మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కనిపించింది. మొదటి ఘాట్ రోడ్డులోని వినాయకస్వామివారి ఆలయం వద్ద చిరుత సంచరించింది. భక్తులు ఈ దృశ్యాలను సెల్ఫోన్నో వీడియోగా చిత్రీకరించారు.… -
శభాష్ మహిళ: చిరుతను ఒంటిచేత్తో…
ముంబై శివారు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చిరుతలు దాడులు చేస్తున్నాయి. నిన్న కూడా ఓమహిళపై చిరుత దాడిచేసింది. అయితే, ఆ మహిళ చిరుతపై దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది. చేతి కర్ర సాయంతో చిరుతపై తిరగబడింది. కర్ర దెబ్బలకు తాళలేక ఆ చిరుత అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. నడుచుకుంటూ ఇంటికి తిరిగి వచ్చిన మహిళ ఇంటి వసారాలో కూర్చున్నది. అప్పటికే మూలన నక్కి ఉన్న చిరుత ఆ మహిళపై దాడిచేసింది. మహిళ అప్రమత్తంగా ఉండటంతో చిన్న… -
బాబోయ్ ఈ వీడియో చూస్తే గుండెలు జారిపోవడం ఖాయం…పర్వతంపై నుంచి పడినా…
మనం పది అడుగుల ఎత్తు నుంచి కిందపడితే కాలో చేయో ఇరిగిపోతుంది. అలాంటిది ఓ ఎత్తైన పర్వతం నుంచి కిందపడినా దానికి ఏమీ కాలేదు. పైగా పట్టువదలని విక్రమార్కునిలా నోటికి చిక్కిన వేటను వదలకుండా పట్టుకుంది. మామూలుగా చిరుతలకు ఆహరం దొరికితే అసలు వదలవు. ఇక మంచు కొండల్లో వాటికి వేట దొరకడమే చాలా కష్టం. అలాంటిది దొరికితే వదులుతాయా చెప్పండి. మంచు చిరుతకు ఓ జింక కనిపించింది. వేటాడేందుకు చిరుత దూకగా అది తప్పించుకునే ప్రయత్నం… -
స్కూల్ క్యాంటిన్లో చిరుత…నాలుగు గంటలపాటు…
ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు… ఓ చిరుత స్కూల్ క్యాంటిన్లోకి దూరింది. విషయం తెలుసుకున్న క్యాంటిన్ సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు, వైల్డ్ లైఫ్ సంస్థకు సమాచారం అందించారు. హుటాహుటిన అటవిశాఖాధికారలు, వైల్డ్ లైప్ సిబ్బంది దాదాపు నాలుగు గంటలపాటు రెస్క్యూ చేసి చిరుతను బందించి అడవిలో వదిలేశారు. Read: “వాలిమై” యూరప్ ట్రిప్ ? చిరుతకు గాయాలు కావడంతో అది క్యాంటిన్లోకి వచ్చి ఉండోచ్చని అధికారులు చెబుతున్నారు. వైల్డ్లైఫ్ ఎస్ఒఎస్ సంస్థ చిరుత రెస్క్యూకి… -
తిరుమలలో చిరుత హల్ చల్…
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అయితే నిన్న శ్రీవారిని 17,736 భక్తులు దర్శించుకున్నారు. అలాగే తలనీలాలు సమర్పించారు 7,838 మంది భక్తులు. ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం1.6 కోట్లుగా ఉంది. ఇక ఇదిలా ఉంటె తిరుమల సన్నిదానం అతిధి గృహం వద్ద చిరుత హల్ చల్ చేసింది. అడవిపందిని నోటికీ కర్చుకొని చిరుత సన్నిదానం అతిధి గృహం సెల్లార్ వద్దకు వచ్చింది. చిరుతను…
తాజావార్తలు
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
ట్రెండింగ్
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!