దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింటన్డికాక్తండ్రి అయ్యాడు. అతడి భార్య సాషా గురువారం ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు డికాక్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. తమ కుమార్తెకు కియారా అనే పేరు పెట్టినట్లు డికాక్ వెల్లడించాడు. ఈ మేరకు భార్య సాషా, కుమార్తె కియారాతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. Read Also: వాండరర్స్ టెస్ట్: భారత్పై సౌతాఫ్రికా ఘనవిజయం కాగా ఇటీవల టెస్టు క్రికెట్కు డికాక్ వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై టీమిండియాతో జరుగుతున్న టెస్టు…
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు మరో గుడ్న్యూస్ అందించింది. రీవాల్యూయేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసిన వారు.. తమ దరఖాస్తును శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రద్దు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్ కోసం విద్యార్థులు చెల్లించిన ఫీజును తిరిగి పొందవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి కాలేజీలలోని ప్రిన్సిపాళ్ల ద్వారా నగదును తీసుకోవచ్చని సూచించింది.…
ఏపీలోని నగరాలు, పట్టణాల్లో ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ రేటుకే భూములు అందించే ఉద్దేశంతో జగనన్న స్మార్ట్ టౌన్ (ఎంఐజీ -మిడిల్ ఇంకమ్ గ్రూప్ లేఅవుట్లు) ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి జిల్లాలో ఒక జగనన్న స్మార్ట్ టౌన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఐదు జిల్లాల్లో భూములను సమీకరించి అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. మిగిలిన జిల్లాలకు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. వనమా రాఘవ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి కోసం పోలీసు బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు తెలిపారు. గురువారం సాయంత్రం వనమా రాఘవను అరెస్ట్ చేసి ఖమ్మం తరలిస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయని… ఈ వార్తల్లో నిజం లేదని ఏసీపీ…
★ నేడు గుంటూరు జీజీహెచ్లో ఆక్సిజన్ ప్లాంట్ల ప్రారంభం… వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం జగన్.. ఒక్కోటి వెయ్యి కిలో లీటర్ల సామర్థ్యమున్న రెండు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు★ చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో నేడు రెండోరోజు చంద్రబాబు పర్యటన… ఉదయం ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ప్రజల నుంచి వినతుల స్వీకరణ… ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుప్పం ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు★ ఇంటర్ ఫస్టియర్లో ఫెయిలైన వారికి కనీస మార్కులు వేసిన తెలంగాణ ఇంటర్ బోర్డు.. నేటి…
పంజాబ్లో ప్రధాని మోదీ కాన్వాయ్ను రైతులు అడ్డుకున్న వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంపై హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ… ఇదో పెద్ద డ్రామాగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశాడు. నిజంగా ఇది ప్రధాని కాన్వాయేనా…? అసలు అందులో ప్రధాని ఉన్నారా? అంటూ ప్రశ్నించాడు. ప్రధాని కాన్వాయ్లో ఉన్నది నటులు కావొచ్చని.. గతంలోనూ పలువురు బీజేపీ నేతలు ఎన్నోసార్లు నాటకాలు ఆడిన సందర్భాలు ఉన్నాయంటూ సిద్ధార్థ్ ఆరోపించాడు. ఈ ఘటనపై వెంటనే విచారణ…
జోహన్నెస్ బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా నాలుగో రోజు ఆట ప్రారంభం కాలేదు. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో పిచ్ మొత్తాన్ని అంపైర్లు కవర్లతో కప్పి ఉంచారు. ఇరుజట్లకు నాలుగోరోజు కీలకంగా మారింది. భారత్ విజయం సాధించాలంటే 8 వికెట్లు తీయాల్సి ఉండగా… దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 122 పరుగులు చేయాల్సి ఉంది. Read Also: 30 ఏళ్లకే క్రికెటర్ రిటైర్మెంట్.. బోర్డు నిర్ణయమే కారణమా?…
పంజాబ్లో ప్రధాని మోదీ కాన్వాయ్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. దీనిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతన్నల కడుపు మండిందని.. అందుకే వారు ప్రధాని మోదీకి చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు కూడా త్వరలోనే రైతులు బుద్ధి చెప్తారని… ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు.…
అమరావతి కార్పొరేషన్ పేరుతో జగన్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపణలు చేశారు. అమరావతి రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని… కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని పేర్కొని కొత్త కుట్రకు తెరలేపారని విమర్శించారు. రాజధాని పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్నా తమ అనుమతి అవసరం అని స్పష్టం చేసిన హైకోర్టు…
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజుకు దాదాపు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నాలుగు వారాల పాటు ప్రభుత్వ డాక్టర్లు, నర్సుల సెలవులను రద్దు చేసింది. థర్డ్ వేవ్కు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను సిద్ధం చేయాలంటూ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. Read Also: ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త కాగా తెలంగాణలో మంగళవారం…