రైతన్నలకు కడుపు మండింది.. అందుకే ప్రధానికి చుక్కలు చూపించారు: షర్మిల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్లో ప్రధాని మోదీ కాన్వాయ్ వ్యవహారంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ నడుస్తోంది. దీనిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతన్నల కడుపు మండిందని.. అందుకే వారు ప్రధాని మోదీకి చుక్కలు చూపించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు కూడా త్వరలోనే రైతులు బుద్ధి చెప్తారని… ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అధికారం ఇస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని షర్మిల మండిపడ్డారు.
Read Also: నాడు గ్రాఫిక్స్ అని తిట్టి… నేడు భూములు తాకట్టు పెట్టబోతున్నారు: సోమిరెడ్డి
Also Read
వ్యవసాయంపై కేంద్రం అనుసరిస్తున్న విధానం, మద్దతు ధర ఇవ్వకపోవడం, చట్టాలు వంటి అంశాల నేపథ్యంలోనే ప్రధాని మోదీని రైతులు అడ్డుకుని.. చివరకు వెనక్కి పంపించారని షర్మిల అభిప్రాయపడ్డారు. ఈ రైతులే రేపు సీఎం కేసీఆర్ అధికారం పట్ల కర్రుకాల్చి వాత పెడతారని హెచ్చరించారు. రైతులు పండించే ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం రైతుకు చితి పేర్చుతోందని… వీధిన పడ్డ రైతుకు అండగా తాము రైతు ఆవేదన యాత్రతో ధైర్యాన్ని నింపుతున్నామని షర్మిల అన్నారు. అయితే తమ రైతు ఆవేదన యాత్రను ఆపడానికి కేసీఆర్ ప్రభుత్వం కరోనా రూల్స్ అడ్డుపెట్టి సంబరపడిపోతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా ముంచుకొస్తున్న మరో రైతాంగ పోరాటాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ చేతకాని సీఎం మనకొద్దని షర్మిల పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!