నాడు గ్రాఫిక్స్ అని తిట్టి… నేడు భూములు తాకట్టు పెట్టబోతున్నారు: సోమిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి కార్పొరేషన్ పేరుతో జగన్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపణలు చేశారు. అమరావతి రాజధానిని 29 గ్రామాల పరిధి నుంచి 19 గ్రామాలకు పరిమితం చేసేందుకే అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని… కార్పొరేషన్ పేరులోనే క్యాపిటల్ సిటీ అని పేర్కొని కొత్త కుట్రకు తెరలేపారని విమర్శించారు.
రాజధాని పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్నా తమ అనుమతి అవసరం అని స్పష్టం చేసిన హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తుందని సోమిరెడ్డి ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని రైతులు కోరుకుంటున్నట్లు 29 గ్రామాలను ఒకే కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఏర్పాటును ప్రజలు వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక అధికారులు ఓటు హక్కు ఉన్నవారే అభిప్రాయాలు తెలపాలంటున్నారని.. మరి పులివెందులలో ఓటుహక్కు ఉన్న జగన్ అమరావతిపై నిర్ణయాలు ఎలా తీసుకుంటారని నిలదీశారు.
Also Read
అమరావతి పరిధిలో ఎకరా రూ.7 కోట్లు విలువ చేస్తుందని చెప్తూ 480 ఎకరాల తాకట్టుకు ఇప్పటికే ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసిందని సోమిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూస్తేనే రైతుల త్యాగం చేసిన 34 వేల ఎకరాల విలువ రూ.2 లక్షల కోట్ల పైబడి ఉంటుందన్నారు. నాడు స్మశానం, గ్రాఫిక్స్ అని తిట్టిన ప్రభుత్వ పెద్దలు.. నేడు రూ. 2 లక్షల కోట్ల పైబడిన అమరావతి భూములను తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండానే వారి భూముల తాకట్టుపై జగన్ కన్నుపడటం దుర్మార్గమన్నారు. రైతులు పెట్టే అన్నం తింటున్న జగన్ వారినే మానసిక క్షోభకు గురిచేస్తున్నారని.. రైతుల మనోవేదనకు వ్యతిరేకంగా వెళ్తే జగన్ను దేవుడు కూడా క్షమించడని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also: సీఎం జగన్కు నారా లోకేష్ బహిరంగ లేఖ
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!