టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని గతంలో ప్రచారం జరిగింది. 2017లో అనిల్ కుంబ్లేను కోచ్ పదవి నుంచి బీసీసీఐ తప్పించింది. అప్పట్లో ఈ వ్యవహారం ఎంత వివాదం సృష్టించిందో తెలిసిందే. 2016లో భారత జట్టు కోచ్గా బాధ్యతలు స్వీకరించిన కుంబ్లే.. రెండేళ్ల కాలం పూర్తవకుండానే ఏడాది తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు. కెప్టెన్కు తన పద్ధతులతో ఇబ్బందిగా ఉందని తెలిసిందంటూ కుంబ్లే స్వయంగా వెల్లడించడంతో…
ఏపీలో గత మూడు రోజులుగా కరెంట్ కష్టాల కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కరెంట్ కోతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీలో కరెంట్ కష్టాలు త్వరలో తీరనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో ఆరు అణు విద్యుత్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు. Read Also: సీఎం జగన్ తో ముగిసిన మంత్రుల కమిటీ భేటీ కరెంట్ కష్టాలపై రాజ్యసభలో తాను…
ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. ముందుగా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ కూడా వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయనకు జ్వరం కారణంగా హాజరుకాలేదని తెలుస్తోంది. కేసీఆర్కు జ్వరంగా ఉందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే సాయంత్రం ముచ్చింతల్లో జరిగే రామానుజచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. Read Also: చలితో…
ఏపీలోని విజయవాడలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఛలో విజయవాడ పేరుతో అనేక ప్రాంతాల నుంచి ఉద్యోగులు తరలివచ్చి ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పీఆర్సీ జీవోలపై ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ఆందోళనలో బెజవాడ ఆడపడుచులు తమ వంతు సహకారం అందించారు. భారీ స్థాయిలో తరలివచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కడికక్కడ మంచినీటి బిందెలు ఏర్పాటు చేసి ఉద్యోగుల దాహర్తి తీర్చారు. ఈ సందర్భంగా తమ ఆందోళనల పట్ల విజయవాడ మహిళలు…
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఏపీ సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడాన్ని లేఖలో ప్రశ్నించారు. అంతేకాకుండా ఏపీలో పెండింగ్లో ఉన్న సమస్యలను లేవనెత్తుతూ సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ‘విభజన తర్వాత రాష్ట్ర ఆదాయం భారీగా కోల్పోయింది. రాష్ట్రాన్ని కేంద్ర సహకారం చాలా అవసరం. పోలవరం నిధులు, రెవెన్యూ లోటు సహా ఇతర అంశాలకు…
త్వరలో జరగనున్న ఐపీఎల్-2022 వేలం బరిలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు కుర్రాడు 29 ఏళ్ల బండారు అయ్యప్ప అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. మీడియం పేస్ బౌలర్గా, రైట్ హ్యాండ్ బ్యాటర్గా అయ్యప్ప రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2019 లీగ్లో అయ్యప్పను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కనీస ధర రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే తుది జట్టులోకి మాత్రం తీసుకోలేదు. Read Also: ఇండియాలో ఐపీఎల్ నిర్వహించడంపై గంగూలీ…
ఏపీలో కరోనా నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1,00,622 పాజిటివ్ కేసులు ఉండగా… ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు కేవలం 2,301 మందేనని సీఎం జగన్కు అధికారులు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. రెండు…
రైల్వే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు రూ.10,080 కోట్లు కేటాయించిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.7,032 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.3,048 కోట్ల కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. 2022-23 బడ్జెట్లో గతంతో పోలిస్తే 30 శాతం కేటాయింపులు పెరిగాయన్నారు. 2021-22 బడ్జెట్లో రూ.7,049 కోట్ల కేటాయింపు జరిగాయని తెలిపారు. ఈ ఏడాది డబ్లింగ్, థర్డ్ లైన్, బై పాస్ల కోసం రూ.5,517 కోట్లు కేటాయించగా..…
ఏపీలో ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ నడుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి చాలా ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. ఉపాధ్యాయ సంఘాలు, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. అయితే ఆర్టీసీలో ఓ వర్గం ఉద్యోగులు మాత్రం తాము ఆందోళనల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశాయి. సీఎం జగన్ తమకు మంచే చేశారని… ఉద్యోగ సంఘాల ఉద్యమంలో తాము భాగం కాలేమని ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రకటించింది.…
రాయలసీమలో కీలక రాజకీయ నేతల్లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఒకరు. అయితే ఏపీలో ఇటీవల చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుపై బైరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు చాలా పెద్దవిగా ఉంటాయని.. అందువల్ల రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమ వైశాల్యం పెద్దగా ఉంటుందని బైరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని…