సీఎం కేసీఆర్కు జ్వరం.. ప్రధాని కార్యక్రమానికి దూరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. ముందుగా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ కూడా వస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆయనకు జ్వరం కారణంగా హాజరుకాలేదని తెలుస్తోంది. కేసీఆర్కు జ్వరంగా ఉందని.. అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే సాయంత్రం ముచ్చింతల్లో జరిగే రామానుజచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
Read Also: చలితో వణుకుతున్న తెలంగాణ .. ఆదిలాబాద్ లో అత్యల్పం
Also Read
కాగా ప్రధాని మోదీకి సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ, మంత్రి తలసాని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. వీఐపీ గేట్ నుండి సీఎస్, డీజీపీలను పోలీసులు అనుమతించకపోవడంతో వాళ్లు మరో గేట్ నుంచి విమానాశ్రయం లోపలకు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా ప్రధాని మోదీ ఇక్రిశాట్కు చేరుకున్నారు. ఇక్రిశాట్లో స్వర్ణత్సోవాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం ముచ్చింతల్లోని సమతా మూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ రానున్నారు.
తాజావార్తలు
-
Naga Bandham : ట్రైలర్’తో హాట్ టాపిక్ అయిన నాగబంధం
-
Special Trains for NEET Candidates: నీట్ అభ్యర్థులకు రైల్వే గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక రైళ్లు
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Prabhas: ఆ సీన్ చూసి ఏడ్చేశా.. షూటింగ్ గ్యాప్లో ప్రభాస్ ఎమోషనల్! అసలు ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!