తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడలో గ్యాస్ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంతో అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కూరగాయల దుకాణంలోకి గ్యాస్ లారీ దూసుకెళ్లింది. దుకాణం ఎదుట పార్క్ చేసిన రెండు ద్విచక్ర వాహనాలు నుజ్జనుజ్జయ్యాయి.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్గా రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. లాంఛనప్రాయ కార్యక్రమంలో, పదవీ విరమణ చేసిన టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పార్టీ జెండాను మహేష్ కుమార్ గౌడ్కు అందజేసి, పార్టీని నూతనోత్సాహంతో ముందుకు నడిపించాలని కోరారు. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.…
ఖైరతాబాద్ గణేషుడిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వస్తున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే పెద్ద విగ్రహం పెట్టిన చరిత్రలో మన ఖైరతాబాద్ గణేష్ది అని ఆయన అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయులదని, ఈ సంస్కృతి నీ రాబోయే తరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు హరీష్ రావు. ఆనాడు బాలా గంగాధర్ తిలక్ భారతీయులను ఒక్క తాటిమీదికి తేవడానికి వినాయక…
“Prophet for the World” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు లభించిందన్నారు. గీత, బైబిల్, ఖురాన్ సారాంశం ప్రపంచ శాంతి మాత్రమేనని, కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని అన్ని మత గ్రంథాలు చెబుతున్నాయని, ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మన ప్రాంతానికి చెందిన వారు కావడం గర్వకారణమన్నారు. గతంలో హైదరాబాద్ లో ఒక వైపు ఓవైసీ, మరో…
సెప్టెంబరు 16న వచ్చే మిలాద్-ఉన్-నబీ కోసం నగరమంతటా ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రవక్త మహమ్మద్ జయంతిని సూచిస్తుంది , హిజ్రీ క్యాలెండర్లోని మూడవ నెల రబీ ఉల్ అవల్ నెల 12వ రోజున జరుపుకుంటారు. రోజున, కమ్యూనిటీ గ్రూపులు రక్తదానం, పండ్ల పంపిణీ, వస్త్రదానం, మతపరమైన సమావేశాలు , ఇస్లాం సంబంధిత అంశాలలో పోటీలు నిర్వహిస్తాయి. వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన శిబిరాల్లో పేదలకు , నిరుపేదలకు కూడా ఆహారం అందించబడుతుంది. ఈ సందర్భంగా…
విజయవాడలో మున్సిపల్ కమిషనర్, అధికారులపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కండ్రికలో మంత్రి నారాయణ పర్యటించారు. బుడమేరు వరద బాధిత ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.
ఈ నెల 16న నిమజ్జనం రోజు వరంగల్ జిల్లాలో మద్యం అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ నెల 16 గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం వున్న నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 16 (సోమవారం) మద్యం విక్రయాలను నిలిపివేయాలని ఆయన సూచించారు. ఈ నెల 16 ఉదయం 6:00 గంటల నుండి మరుసటి రోజు 17 ఉదయం 6:00 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు…
అమెరికాలో పది రోజులు జల్సా చేసి వచ్చి కేటీఆర్ ఇప్పుడు తెగ హడావిడి చేస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలు, వరదల వల్ల ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రజలు అల్లాడిపోతే వారి గురించి కేటీఆర్ మాట్లాడరని, రాష్ట్రానికి 10 వేల కోట్ల నష్టం జరిగితే కేసీఆర్, కేటీఆర్ కనీసం స్పందించలేదన్నారు. అమెరికా నుంచి రాగానే ఖమ్మం ప్రజలను పరామర్శించడానికి కేటీఆర్ వెళ్తాడని అనుకున్నామని, సూర్యాపేట, మహబూబాబాద్ రైతులను కలుస్తడని భావించామన్నారు. కౌశిక్ రెడ్డి అనే శాడిస్ట్, సైకో,…
స్టీల్ ప్లాంట్ సంక్షోభం రాజకీయ వేడిని రాజేస్తోంది. విశాఖ ఉక్కు మూసివేయడమే అంతిమ నిర్ణయం అయితే తన పదవికి రాజీనామా చేస్తానని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు.
నంద్యాల పట్టణ శివారులో వక్ఫ్ బోర్డ్ స్థలంలో నిర్మిస్తున్న ఇంటి కూల్చడానికి వెళ్లిన అధికారుల బృందానికి చుక్కెదురైంది. ఆ ఇంటి యజమాని తన ఇంటిని కూలిస్తే చనిపోతానని బెదిరించాడు. కూల్చడానికి సిద్ధమవుతున్న తహసీల్దార్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు ఇంటి యజమాని ఉరుకుంద.