ధర్మపురి జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తిపాడు రిజర్వాయర్ మంజూరు చేసి మీ కష్టాలు తీర్చాలని మా నేతలు కోరారన్నారు. రామగుండంలో 2వేల మెగావాట్ల పవర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారని, నేతకాని సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారన్నారు. మీరు అడిగినవన్నీ మంజూరు చేస్తా… కానీ 2లక్షలకు పైగా మెజార్టీతో గడ్డం వంశీని గెలిపించండని ఆయన అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కు ఒక గొప్ప…
10 రోజులకు పైగా కాలిపోతున్న ఉష్ణోగ్రతలను తట్టుకున్న తర్వాత, హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలకు తీవ్రమైన వేడి నుండి కొంత ఉపశమనం లభించింది.హైదరాబాద్తో సహా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వేడిగాలులు వచ్చే వారం నుండి తగ్గుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సూచించింది. మే 6 వరకు రాష్ట్రంలో హీట్వేవ్ అలర్ట్ కొనసాగుతుండగా, ఆ తర్వాత గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది . మే 7 నుండి, ఉరుములు మరియు మెరుపులతో కూడిన హెచ్చరికలకు మార్పు…
ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటి పెరుగుతున్నందున, తెలంగాణకు ఇది అత్యంత కఠినమైన వేసవి సీజన్లలో ఒకటిగా మారుతుందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురిసే ముందు, మే మొదటి వారం వరకు తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతాయని వారు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్కు మించి నమోదయ్యాయి. అయితే.. ఇవాళ ఎండలకు హైదరాబాద్ మండిపోయింది. ఈ సమ్మర్లోనే హైదరాబాద్లో ఇవాళ హాటెస్ట్ డే రికార్డ్ అయ్యింది.…
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 78 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 273 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనే లేవని, పీక్ డిమాండ్ లో కూడా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుండగా బిఆర్ఎస్ నేతలు రాజకీయ పబ్బం గడుపు కోవడానికి అసత్య ప్రచారం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు తప్పుపట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతదని అసెంబ్లీ ఎన్నికల ముందు బి ఆర్ ఎస్ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టి ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ ప్రజలు…
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసరి పల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వీరంతా పసుపు కండువా కప్పుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న ..రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై తనకు, సీఎం జగన్కు అమితమైన ప్రేమ ఉందని.. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామన్నారు.
‘హలో…మీ అబ్బాయి రేప్ కేసులో చిక్కుకున్నాడు. అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాం. మీరు అతన్ని విడిపించాలనుకుంటే వెంటనే ఈ నంబర్కు కాల్ చేయండి. మీకు కూడా అలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కాలర్ చెప్పినట్లుగా వింటే మాత్రం.. మీ బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. అంతేకాకుండా.. సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అవును, దేశంలో ఇలాంటి మోసం ఘటనలు చాలానే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు…
నేను రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసి ఉంటే నాకు కాంగ్రెస్ బి పామ్ ఇస్తుందా….? అని యాదాద్రి జిల్లా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బూర నర్సయ్య గౌడ్ ఎంపీ గా ఉన్న సమయంలో తెచ్చిన నిధుల పైన శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎందుకు కనిపించడం లేదని ఆయన అన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. బూర…
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మళ్ళీ అసంబద్ధ హామీలు అని ఆయన విమర్శించారు. సర్పంచ్లకు నేరుగా నిధులు ఆల్రెడీ వస్తున్నాయని, పీఎం సూర్య ఘర్ సోలార్ విద్యుత్ యోజన.. ఇప్పటికే కేంద్రం ప్రారంభించిందన్నారు కిషన్ రెడ్డి. సంగీత నాటక అకాడమీ కి ఫౌండేషన్ , ఘంటశాల కళమండపం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది.. శంఖుస్థాపన…