Kesineni Swetha: వైఎస్సార్సీపీ పార్టీ.. కార్మికుల పక్షపాత పార్టీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kesineni Swetha: విజయవాడ వ్యాపార రంగానికి వస్త్రలత ఒక ల్యాండ్ మార్క్ వంటిదని కేశినేని శ్వేత అన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ కార్మికుల, కర్షకుల పక్షపాత పార్టీ అని వ్యాఖ్యానించారు. పేదల, కార్మికుల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అమ్మ ఒడి ,చేయూత, వాహన మిత్ర వంటి పథకాలతో పాటుగా ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సహాయాన్ని అందిన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని పేర్కొన్నారు. నవరత్న పథకాలతో రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు. ఆ పథకాలను కాపీ కొట్టి టీడీపీ మేనిఫెస్టో తయారు చేసిందని విమర్శించారు. వాలంటరీ వ్యవస్థను మొదటి నుంచి వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ కూటమి పెద్దలు ఇప్పుడు వాలంటరీలకు 10,000 వేతనం ఇస్తామంటూ చెప్పడం హాస్యాస్పదమన్నారు. వృద్ధాప్య, వికలాంగుల, వితంతు తదితర పింఛనుదారులకు ఇంటింటికి పింఛను వెళ్ళనీయకుండా చేసిన చంద్రబాబుకు పింఛనుదారులంతా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
Read Also: AP Weather: రికార్డు స్థాయిలో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత.. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Also Read
- Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్లకు ఎఫ్డీఏ షాకాజ్ నోటీసులు
- Ashish Banerjee Death: మాజీ డిప్యూటీ స్పీకర్ అనుమానాస్పద మృతి.. పార్టీ ఆఫీస్లో ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం
- 2027 ODI World Cup: వన్డే ప్రపంచకప్ తేదీలో మార్పులు? ఆ రోజే తొలి మ్యాచ్.. పూర్తి వివరాలు ఇవే..
- AI manager: 17 సార్లు లేట్గా వచ్చాడు.. ఉద్యోగం నుంచి తీసేయాలని ఏఐ మేనేజర్ సిఫార్సు..
మండుటెండల్లో పింఛన్దారులను బ్యాంకుల చుట్టూ టీడీపీ నాయకులు తిప్పుతున్నారని.. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. విజయవాడ నగరాన్ని కేశినేని నాని రెండు దాఫాలు ఎంపీగా చేసి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో సైతం అదే అభివృద్ధిని కొనసాగించాలంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వ్యాపారస్తులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. అనంతరం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41 వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని శ్వేత పాల్గొన్నారు. విజయవాడ ప్రజలు గడప గడపకు వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారని.. కేశినేని నానిని, ఆసిఫ్ని గెలిపించుకోవడం మా బాధ్యత అంటున్నారన్నారు.
తాజావార్తలు
-
Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
-
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
-
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
-
Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్లకు ఎఫ్డీఏ షాకాజ్ నోటీసులు
-
Yashasvi Jaiswal Record: 30 వేదికలు, 30 మ్యాచ్లు.. టీమిండియా యువ ఓపెనర్ ఖాతాలో వింత రికార్డు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!