శ్రీశైలంలో పర్యటిస్తున్నారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు. శ్రీశైలం డ్యామ్ శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు సభ్యులు. అక్కడి అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులతో పాటు జలశక్తి ,ఏపీ జలవరుణ శాఖ అధికారులు వున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పరిశీలించారు సభ్యులు. ఇప్పటికే కేంద్రం గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో తమ పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను తీసుకునేందుకు యత్నిస్తోంది కేఆర్ఎంబీ బోర్డు.…
ఇవాళ, రేపు కర్నూలు జిల్లాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించనుంది 10 మంది కేఆర్ఎంబీ బృందం. కృష్ణానదీ ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపధ్యంలో జిల్లాలో పర్యటిస్తోంది కేఆర్ఎంబీ టీమ్. నేడు మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యు లేటర్ ను సందర్శించనుంది. రేపు శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రాలను పరిశీలించనుంది కేఆర్ఎంబీ టీమ్. అనంతరం శ్రీశైలంలో కేఆర్ఎంబీ టీం సమీక్ష…
ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు గంజాయి, మరోవైపు అక్రమ మద్యం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కర్నూలు జిల్లాలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మకరం చేశారు. అక్రమ రవాణా పై కర్నూలు స్పెషల్ ఎన్ ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. కర్నూలు అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పంచలింగాల వద్ద సెబ్ తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక బ్యాగ్లో 75 లక్షల రూపాయలు నగదు పట్టుకున్నారు. సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న…
దసరా పండుగను అంతా ఘనంగా సెలబ్రేట్ చేస్తే.. ఏపీలోని ఓ ప్రాంతంలో మాత్రం కర్రల సమరం జరుగుతోంది.. కర్నూలు జిల్లాలోని హుళగుంద మండలంలోని దేవరగట్టు మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర ఉత్సవం నిర్వహిస్తున్నారు.. అర్ధరాత్రి సమయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.. ఉత్సవంలోని మూర్తులను దక్కించుకోవడానికి ఊర్లకు ఊర్లే తలపడతాయి.. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలను చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. ఈ ఉత్సవంలో పాల్గొంటారు.. మరోవైపు అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద,…
విజయదశమి రోజు దేశ వ్యాప్తంగా పండుగ నిర్వహిస్తే, కర్నూలు జిల్లాలోని హుళగుంద మండలంలోని దేవరగట్టు మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర ఉత్సవం ఈరోజు జరగనున్నది. ఈ రోజు అర్ధరాత్రి సమయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక ఉత్సవంలోని మూర్తులను దక్కించుకోవడానికి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాలను పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి తరలి వస్తారు. మరోవైపు అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఆ మూర్తుల…
టమోటా ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది.. కిలో ధర ఏకంగా రూపాయికి పడిపోయింది.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో దారుణంగా పడిపోయింది టమోటా ధర.. ఇవాళ కిలో టమోటా ఒక్క రూపాయికే అమ్ముడు పోయింది.. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.. వారికి మద్దతుగా రైతు సంఘం ధర్నా చేపట్టింది.. టమోటా రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ లో ధర్నా చేశారు అన్నదాతలు.. ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని…
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో వివాదం పై మంత్రి జయరాం ఎన్టీవీతో మాట్లాడుతూ… పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయమని నేను చెప్పింది వాస్తవం. నా నియోజకవర్గంలో ఇసుక రీచ్ లే లేవు. ఇక అక్రమంగా ఇసుక దందా చేయటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని అన్నారు. కానీ…
ఆ ఎస్పీ కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన జిల్లాకు అడుగుపెట్టకముందే, ఆయన పనితీరు తెలిసి తలలు పట్టుకున్నారు. సరిగ్గా నెలకూడా గడవలేదు…ఆయనేంటో అధికారపార్టీ నేతలకు పూర్తిగా అర్థమై పోయింది. ద్వితీయ శ్రేణి నాయకుల సంగతి అటుంచితే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లకే ఆ ఎస్పీ కొరుకుడు పడడం లేదట…ఇంతకీ ఎవరా ఎస్పీ? ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? కర్నూలు జిల్లా పోలీస్ బాస్ గా కర్ణాటక క్యాడర్ అధికారి సుధీర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారని…
ఉల్లి పంట ఎక్కువగా పండే జిల్లాల్లో కర్నూలు ఒకటి. కర్నూలు జిల్లాలో రైతులు ఎక్కువగా ఉల్లిని పండిస్తుంటారు. ఉల్లి పంటకు ఎప్పుడు గిరాకి వస్తుందే ఎప్పడు నేల చూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే, జిల్లాలోని ఉల్లి రైతులు రోడ్డెక్కారు. గత 10 రోజులుగా ఉల్లిని కొనుగోలు చేయడం వ్యాపారులు నిలిపివేయడంతో రైతులు ఆందోళనల చేస్తున్నారు. ఈనాం పద్దతిలో ఉల్లిని కోనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, తాము ఈనాం పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేయలేమని చెప్పి…
కర్నూలు జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన మూడు ఇళ్లలో వరసగా మంటలు చెలరేగాయి. ఒక ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పివేయగా పక్కనే ఉన్న మరో ఇంట్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయగా మూడో ఇంట్లోకూడా అదే విధంగా మంటలు చెలరేగడంతో కుటుంబసభ్యులు భయపడ్డారు. ఇంట్లోని వస్తువులను బయటపడేసి బయటే కూర్చుండిపోయారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని కోడుమూరులోని ఒకటో వార్డులో జరిగింది. ఈ వార్డులో నివశించే ఖాజావలి,…