Home
Kurnool
Kurnool News
-
వీడియో వివాదం పై స్పందించిన మంత్రి జయరాం…
ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. ఇసుక అక్రమంగా తరలింపు వ్యవహారంలో స్థానిక ఎస్సైని మంత్రి బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో వివాదం పై మంత్రి జయరాం ఎన్టీవీతో మాట్లాడుతూ… పట్టుకున్న ట్రాక్టర్లను వదిలేయమని నేను చెప్పింది వాస్తవం. నా నియోజకవర్గంలో ఇసుక రీచ్ లే లేవు. ఇక అక్రమంగా ఇసుక దందా చేయటానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని అన్నారు. కానీ… -
కొత్త ఎస్పీని చూడగానే నేతలకు తలనొప్పి..
ఆ ఎస్పీ కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన జిల్లాకు అడుగుపెట్టకముందే, ఆయన పనితీరు తెలిసి తలలు పట్టుకున్నారు. సరిగ్గా నెలకూడా గడవలేదు…ఆయనేంటో అధికారపార్టీ నేతలకు పూర్తిగా అర్థమై పోయింది. ద్వితీయ శ్రేణి నాయకుల సంగతి అటుంచితే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లకే ఆ ఎస్పీ కొరుకుడు పడడం లేదట…ఇంతకీ ఎవరా ఎస్పీ? ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? కర్నూలు జిల్లా పోలీస్ బాస్ గా కర్ణాటక క్యాడర్ అధికారి సుధీర్ కుమార్ రెడ్డి నియమితులయ్యారని… -
కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల ఆందోళన… ఎందుకంటే…
ఉల్లి పంట ఎక్కువగా పండే జిల్లాల్లో కర్నూలు ఒకటి. కర్నూలు జిల్లాలో రైతులు ఎక్కువగా ఉల్లిని పండిస్తుంటారు. ఉల్లి పంటకు ఎప్పుడు గిరాకి వస్తుందే ఎప్పడు నేల చూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే, జిల్లాలోని ఉల్లి రైతులు రోడ్డెక్కారు. గత 10 రోజులుగా ఉల్లిని కొనుగోలు చేయడం వ్యాపారులు నిలిపివేయడంతో రైతులు ఆందోళనల చేస్తున్నారు. ఈనాం పద్దతిలో ఉల్లిని కోనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, తాము ఈనాం పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేయలేమని చెప్పి… -
కర్నూలులో వింత సంఘటన… వరసగా మూడు ఇళ్లలో మంటలు… ఆర్పేందుకు ప్రయత్నిస్తే…
కర్నూలు జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన మూడు ఇళ్లలో వరసగా మంటలు చెలరేగాయి. ఒక ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పివేయగా పక్కనే ఉన్న మరో ఇంట్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయగా మూడో ఇంట్లోకూడా అదే విధంగా మంటలు చెలరేగడంతో కుటుంబసభ్యులు భయపడ్డారు. ఇంట్లోని వస్తువులను బయటపడేసి బయటే కూర్చుండిపోయారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలోని కోడుమూరులోని ఒకటో వార్డులో జరిగింది. ఈ వార్డులో నివశించే ఖాజావలి,… -
కర్నూలులో ఆన్లైన్ పెళ్లి…
కరోనా కారణంగా పెళ్లిళ్లు కుడా ఆన్లైన్లో చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కర్నూల్కు చెందిన రజిత, నల్గొండకు చెందిన దినేశ్రెడ్డిల వివాహం కర్నూలు లోని ఓ ఫంక్షన్ హాల్లో ఆన్ లైన్ లో జరిగింది. రజిత, దినేష్రెడ్డిలకు రెండేళ్ల క్రితం వివాహం జరిపించాలని ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అమ్మాయి, అబ్బాయి ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలోని డింబోలలో ఉంటున్నారు. కరోనా కారణంగా వీరి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్లోనే వివాహం… -
ప్రశ్నిస్తే కేసులా..?.. అఖిలప్రియ ఫైర్
విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతోందని.. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు.. ఆళ్లగడ్డ మండలం ఆర్ క్రిష్ణాపురంలో వైసీపీ నేతలు ఎర్రమట్టి దందా సాగిస్తున్నారన్న ఆమె.. పుల్లయ్య అనే వ్యక్తి పేరు మీద ఎకరాకు పర్మిషన్ తీసుకొని… మరికొన్ని ఎకరాల్లో ఎర్రమట్టి తవ్వుతున్నారని.. ఆళ్లగడ్డ… -
నీటి వివాదాలపై కర్నూలు వైసీపీ నేతలు మౌనం…?
ప్రజల కష్టాలు, ప్రాంతం సమస్యల కంటే వారికి సొంత వ్యాపారాలు.. ఆస్తులే ఎక్కువ అయ్యాయా? తీవ్ర నష్టం చేకూర్చే చర్యలు జరుగుతోన్నా.. అధినేతను విమర్శిస్తున్నా నోరెత్తకపోవడానికి కారణం అదేనా? సీమకు ప్రాణాధారమైన రాయలసీమ లిఫ్ట్.. RDS కుడి కాల్వలకు తెలంగాణ అడ్డుపడినా కర్నూలు నేతలు స్పందించకపోవడానికి అవే కారణాలా? జల జగడంపై పెదవి విప్పని కర్నూలు వైసీపీ నేతలు! రాయలసీమ ఎత్తిపోతల పథకం, RDS కుడి కాలువ పనులు తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి.… -
సీమ ప్రాజెక్టులపై బీజేపీ ఫోకస్..! ఎల్లుండి కీలక భేటీలు..
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోన్న సమయంలో.. చర్చలకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ.. ఎల్లుండి కర్నూలులో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాయలసీమ పదాధికారులు, ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాయలసీల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువ, గుండేగుల, వేదవతి ప్రాజెక్టులపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.. ప్రాజెక్టుల అంశంలో భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా… -
కర్నూలు జంట హత్యల కేసులో 9 మంది అరెస్టు…
కర్నూలు పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసారు. రాజా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కేధార్ నాద్ రెడ్డి తో పాటు మరో ఆరుమందిని అరెస్టు చేసి వారిని నంద్యాల కోర్టుకు తరలించారు పోలీసులు. ఈనెల 17న గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టీడీపీ నేతలు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలను రెండు వాహనాలతో ఢీకొట్టి వేటకొడవళ్ళతో నరికి చంపారు నిందితులు. గ్రామంలో అధిపత్యం, కుటుంబాల మద్య పాత… -
కర్నూలు దారుణంః ఒకే కుటుంబంలో…
కర్నూలులో ఓ దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చిన ప్రతాప్, వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక, తానుకూడా విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలో ప్రతాప్ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. మానసిక కుంగుబాటుతోనే ప్రతాప్ ఈ ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మాహత్యకు పాల్పడటంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకోన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vijay – Trisha : అన్ఫాలో చేసిన త్రిష.. విజయ్తో ఇక బ్రేకప్?
-
Ranabali: విజయ్, రష్మిక సినిమా రిలీజ్ డేట్పై కొత్త సస్పెన్స్.. అసలు ఏం జరుగుతోంది?
-
Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్కు అర్హత..
-
Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
-
Obsession: ‘రాజ్’ సినిమానే ‘అబ్సెషన్’నా? విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
జియో, ఎయిర్టెల్కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!