Srisailam: స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలంలో మంగళవారం, శుక్రవారాలలో స్వామివారి ఉచిత స్పర్శదర్శనం వుంటుంది. అయితే ఈ ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేశారు దేవస్థానం అధికారులు. శ్రీ శైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మంగళవారం నుండి శుక్రవారం వరకు భక్తులకు కల్పిస్తున్న మల్లికార్జునస్వామి స్పర్శ దర్శన వేళలు మార్చాలని దేవస్థానం నిర్ణయించింది.
నేటినుండి నుంచి వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు భక్తులందరికీ శ్రీస్వామివార్ల ఉచిత స్పర్శదర్శనానికి అనుమతిస్తుంది. గతంలో వారంలోని నాలుగు రోజులలోమంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు తిరిగి సాయంత్రం 6 నుంచి 7 వరకు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తుండేది. అయితే మధ్యాహ్నం 3 తరువాత స్వామివారి అలంకార దర్శనం మాత్రమే వుండటంతో స్పర్శదర్శనం కోసం సాయంత్రం 6 గంటలవరకు వేచి వుండాల్సి వస్తున్నది.
Also Read
దీనివలన దర్శనం ముగించుకొని ఇతరప్రాంతాలకు వెళ్ళేందుకు ఇబ్బందికరంగా ఉందని పలువురు భక్తులు దేవస్థానం దృష్టికి తీసుకురావడంతో ఈవిషయమై భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ్టి నుంచి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు భక్తులందరికీ స్పర్శదర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో లవన్న తెలియజేసారు. మధ్యాహ్నం గంటసేపు అదనంగా స్పర్శదర్శనం కల్పిస్తున్న కారణంగా సాయంత్రం 6 నుంచి 7 వరకు అమలులో ఉన్న స్పర్శ దర్శనం నిలుపుదల చేస్తామని ఈవో లవన్న తెలిపారు. అలాగే, స్సర్శదర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించి రావాలని భక్తులను ఈవో లవన్న కోరారు.
TDP : ఆ మాజీమంత్రి మహానాడుకు వెళ్తే ఆదరించరని సందేహం కలిగిందా..?
తాజావార్తలు
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!