Chilkur Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (KTR) రంగరాజన్ను వ్యక్తిగతంగా పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన చర్య. దీన్ని ఎవరు చేసినా, ఏ పేరుతో చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. దేవాలయ సేవలో నిమగ్నమవుతున్న రంగరాజన్, సౌందర్య…
Mahesh Kumar: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని రిమ్మనగూడ గ్రామంలోని ఓ ప్రైవేటు హోటల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ ఈ సమావేశంలో అవినీతి, రాజకీయ సమస్యలపై స్పందించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫాం హౌస్ కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు? గజ్వేల్ ప్రజలను పట్టించుకోకుండా,…
కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగింది.. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పులు తడక అంటున్నారని దుయ్యబట్టారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇళ్లిల్లు పరిశీలన చేసి గణన చేయడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన నయవంచనను అసెంబ్లీలో, మండలిలో ఎండగట్టామని అన్నారు. తప్పుల తడకగా ఉన్న కులగణనను మళ్లీ నిర్వహించాలని కోరామని తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు దిశగా దూసుకెళ్తోంది. 42 స్థానాల్లో బీజేపీ లీడింగ్ లో ఉంది. కాగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై సెటైర్స్ వేస్తూ ఎక్స్ లో పోస్టు చేశాడు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. మరోసారి బీజేపీని గెలిపించిన…
KTR : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కే. తారక రామారావుకు (కేటీఆర్) మరో అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం ఇవాన్స్టన్ పట్టణంలో ఉన్న నార్త్వెస్టర్న్ యూనివర్సిటీలో ఏప్రిల్ 19, 2025న జరగనున్న కెల్లాగ్ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (KIBC-2025) లో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. ఈ మేరకు కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ చెనాక్షా గోరెంట్ల ప్రత్యేకంగా లేఖ ద్వారా ఆహ్వానం పంపారు. Railway Ticket: రైల్వే కౌంటర్…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మీ ఢిల్లీ బాసులు, మీ గల్లీ దోస్తులు ఆకలి తీర్చడం కాదు, ముందు మధ్యాహ్న భోజన పథకంపై దృష్టి పెట్టాలని సూచించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేసిన కేటీఆర్, పేదల గూళ్లపై బుల్డోజర్లు పంపడంలో ఉన్న ప్రేమ, ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు తిండి పెట్టడంలో లేదా? అని ప్రశ్నించారు. అమృత్ స్కీమ్ను…
గులాబీ బాస్ కేసీఆర్... ఇటీవల తనను కలిసిన పార్టీ నాయకులతో ఉత్తేజపూరితంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారని, వాళ్ళు దొరికితే కొట్టేంత కోపం మీద ఉన్నారంటూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చేశారు. నేనేదో..... ఫామ్హౌస్లో కామ్గా ఉన్నానని అనుకుంటున్నారేమో... కో....డ్తే...... మామూలుగా ఉండదని అంటూ అక్కడున్నవారిలో జోష్ నింపే ప్రయత్నం చేశారాయన.
MLA Anirudh Reddy : తెలంగాణలో ఇటీవల, ఒక ముఖ్యమైన రాజకీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు నాయకులు , మీడియా ద్వారా ప్రచారం చేయబడిన రహస్య భేటీ వివాదంపై, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం స్పందించారు. కొన్ని రోజుల క్రితం, ఈ ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలతో కలిసి రహస్య భేటీ నిర్వహించారని, ఆ భేటీలో వారు ఒక మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే, గురువారం జరిగిన…