KTR : 2014లో కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టారు.. ఈ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది
- ఎస్సీ వర్గీకరణను మేము అడ్డుకున్నట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది
- వర్గీకరణపై కాంగ్రెస్సే పోరాడినట్టు చిత్రీకరిస్తున్నారు
- 2014 నవంబర్ 29న కేసీఆర్ వర్గీకరణపై తీర్మానం పెట్టారు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని ప్రవేవపెట్టారు. అయితే.. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం దేశంలో అనేక పోరాటాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కట్టుబడినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా, ఎస్సీ వర్గీకరణను అమలు చేయడం తనకు అత్యంత సంతృప్తినిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను మేము అడ్డుకున్నట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. వర్గీకరణపై కాంగ్రెస్సే పోరాడినట్టు చిత్రీకరిస్తున్నారని, 2014 నవంబర్ 29న కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై తీర్మానం పెట్టారని ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని కేటీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా.. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానం ను స్వాగతిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. అంతేకాకుండా.. బీసీలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
CPM Srinivasa Rao: సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు..
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
‘బీసీల సంఖ్యను ఐదు శాతం తగ్గించి బీసీల గొంతు కోసిన ప్రభుత్వ కుట్రను నిరసనగా వాకౌట్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభాను తగ్గించిన తీరును రాష్ట్రంలోని బలహీన వర్గాలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి వాదనను, భాదను అసెంబ్లీలో తెలుపుదామంటే ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. బలహీన వర్గాల అంశానికి సంబంధించి బలహీన వర్గాల వాదనను అసెంబ్లీలో వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన దగాను మోసాన్ని… గొంతు కోసిన తీరును నిరసిస్తూ శాసనసభ నుంచి వాకౌట్ చేస్తున్నాము’ అని కేటీఆర్ అన్నారు. అనంతరం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!