T. Ram Mohan Reddy: కేటీఆర్ ఇలాగే అబద్ధాలు మాట్లాడితే ప్రజలు బయట తిరగనివ్వరు..
- వికారాబాద్ లో ఒక్క రైతుకైనా రుణమాఫీ చేశారా..
- సీఎం రేవంత్ గురించి కేటీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారు..
- అమెరికాలో ఉండి లాటరీలో కేటీఆర్ మంత్రి అయ్యారు..
- కేటీఆర్, హరీశ్ రావు, కవిత లాటరీ బ్యాచ్: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T. Ram Mohan Reddy: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇక, కేటీఆర్ దమ్ముంటే శివారెడ్డిపల్లెకి రావాలంటూ సవాల్ విసిరారు. మీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ ఇచ్చిందో.. మా సర్కార్ ఎంత ఇచ్చిందో నువ్వు ఆర్టీఐకి దరఖాస్తు చేసుకుంటే తెలుస్తుంది అన్నారు. ఇక, పూర్తి వివరాలు కావాలంటే, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపీకి అర్జీ పెట్టుకుంటే పూర్తి డేటా ఇస్తాడన్నారు. అయితే, పరిగి నియోజకవర్గంలో రూ. 1000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మీరు చేసిన చారాణా రుణమాఫీ వడ్డీలకి సరిపోలేదు.. వికారాబాద్ లో ఒక్క రైతుకైనా మీరు రుణమాఫీ చేశారని ప్రశ్నించారు. ఇక, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పేరుతో పరిగి వచ్చిండు.. ఆయన గురించి మాట్లాడితే మేము స్వాగతిస్తాం.. కానీ, కేటీఆర్ ఒక్క మాట అంబేద్కర్ గురించి మాట్లాడి.. 99మాటలు నా గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండు అంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Manchu Family: మెజిస్ట్రేట్ ముందే తిట్టుకున్న మంచు మనోజ్ & మోహన్ బాబు!
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
ఇక, రేవంత్ రెడ్డి లాటరీ ముఖ్యమంత్రి అని కేటీఆర్ అన్నాడు.. కానీ, నువ్వు అమెరికాలో ఉండి లాటరీతో మంత్రివి అయ్యావంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత లాటరీ బ్యాచ్ అని విమర్శించారు. ఇక, ఫార్ములా ఈ-కార్ రేసులో నీపై ఏసీబీ, ఈడీ విచారణ చేస్తుంది.. లిక్కర్ స్కాంలో నీ చెల్లి జైలుకు పోయి వచ్చింది.. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు.. ఫాన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు విచారణ ఎదుర్కొంటున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిగి నియోజక వర్గంలో ఫైలెట్ ప్రాజెక్టు కింద మండలంలోని ఒక గ్రామంలో అందరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు.. కానీ, దుబాయ్, సింగపూర్ లలో కేటీఆర్ ఎంత మందిని పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేటీఆర్ అబద్దాలు చెప్తుండు.. నీవు ఇలాగే అబద్దాలు చెబితే.. ప్రజలు నిన్ను బయట తిరగనివ్వరు అంటూ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.
- Tags
- BRS
- congress
- ktr
- Parigi
- T RamMohan Reddy
తాజావార్తలు
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
-
Mamata Banerjee: పార్టీ వీడేవారు జూలై 21లోగా వెళ్లిపోండి.. మమతా అల్టిమేటం..
-
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్లో 50+ సిక్సర్లు..
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!