T. Ram Mohan Reddy: కేటీఆర్ ఇలాగే అబద్ధాలు మాట్లాడితే ప్రజలు బయట తిరగనివ్వరు..
- వికారాబాద్ లో ఒక్క రైతుకైనా రుణమాఫీ చేశారా..
- సీఎం రేవంత్ గురించి కేటీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారు..
- అమెరికాలో ఉండి లాటరీలో కేటీఆర్ మంత్రి అయ్యారు..
- కేటీఆర్, హరీశ్ రావు, కవిత లాటరీ బ్యాచ్: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T. Ram Mohan Reddy: వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇక, కేటీఆర్ దమ్ముంటే శివారెడ్డిపల్లెకి రావాలంటూ సవాల్ విసిరారు. మీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ ఇచ్చిందో.. మా సర్కార్ ఎంత ఇచ్చిందో నువ్వు ఆర్టీఐకి దరఖాస్తు చేసుకుంటే తెలుస్తుంది అన్నారు. ఇక, పూర్తి వివరాలు కావాలంటే, అగ్రికల్చర్ డైరెక్టర్ గోపీకి అర్జీ పెట్టుకుంటే పూర్తి డేటా ఇస్తాడన్నారు. అయితే, పరిగి నియోజకవర్గంలో రూ. 1000 కోట్ల రుణమాఫీ చేశామన్నారు. మీరు చేసిన చారాణా రుణమాఫీ వడ్డీలకి సరిపోలేదు.. వికారాబాద్ లో ఒక్క రైతుకైనా మీరు రుణమాఫీ చేశారని ప్రశ్నించారు. ఇక, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పేరుతో పరిగి వచ్చిండు.. ఆయన గురించి మాట్లాడితే మేము స్వాగతిస్తాం.. కానీ, కేటీఆర్ ఒక్క మాట అంబేద్కర్ గురించి మాట్లాడి.. 99మాటలు నా గురించి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిండు అంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Manchu Family: మెజిస్ట్రేట్ ముందే తిట్టుకున్న మంచు మనోజ్ & మోహన్ బాబు!
Also Read
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Vikarabad: అమానుషం.. ఆస్తి కోసం కన్న కొడుకు ఏం చేశాడంటే..!
- CM Revanth Reddy: రాహుల్ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
- Woman Constable: సూ*సైడ్ లెటర్ రాసి.. మహిళ కానిస్టేబుల్ ఆ*త్మహ*త్య
ఇక, రేవంత్ రెడ్డి లాటరీ ముఖ్యమంత్రి అని కేటీఆర్ అన్నాడు.. కానీ, నువ్వు అమెరికాలో ఉండి లాటరీతో మంత్రివి అయ్యావంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత లాటరీ బ్యాచ్ అని విమర్శించారు. ఇక, ఫార్ములా ఈ-కార్ రేసులో నీపై ఏసీబీ, ఈడీ విచారణ చేస్తుంది.. లిక్కర్ స్కాంలో నీ చెల్లి జైలుకు పోయి వచ్చింది.. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు.. ఫాన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు విచారణ ఎదుర్కొంటున్నాడు అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిగి నియోజక వర్గంలో ఫైలెట్ ప్రాజెక్టు కింద మండలంలోని ఒక గ్రామంలో అందరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు.. కానీ, దుబాయ్, సింగపూర్ లలో కేటీఆర్ ఎంత మందిని పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందడానికి కేటీఆర్ అబద్దాలు చెప్తుండు.. నీవు ఇలాగే అబద్దాలు చెబితే.. ప్రజలు నిన్ను బయట తిరగనివ్వరు అంటూ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.
- Tags
- BRS
- congress
- ktr
- Parigi
- T RamMohan Reddy
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!