6 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను జైళ్లకు పంపించే కుట్ర కేసీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల లిస్ట్ నుండి బీజేపీ వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతుంని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో సవాల్ చేసి తోక ముడుచుకొని పారిపోయింది మీరంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిధులపై కేటీఆర్ మీ అయ్యతో చర్చకు సిద్దం.. రాజీనామ పత్రం పట్టుకొని మీ అయ్యను రమ్మను అంటూ సవాల్ విసిరారు.
అసంతృప్త…అసమ్మతి నేతల అంశాన్ని బీఆర్ఎస్ ఏం చేయనుంది ? అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో…ఆ నేతలను గులాబీ పార్టీ బుజ్జగిస్తుందా ? అవసరం లేదనుకుని లైట్ తీసుకుంటుందా ? ఈ నేతల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న దానిపై…టిఆర్ఎస్ పెద్దలు వెయిట్ చేస్తున్నారా ? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు…షెడ్యులు ప్రకారం ఈ ఏడాది చివరిలో జరగనున్నాయ్. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీలో…అప్పడే అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎమ్మెల్యేలు నియెజకవర్గాల్లో…
Bandi Sanjay: సీఎం కేసీఆర్ కామారెడ్డికి వచ్చేదాకా కలెక్టర్ కార్యాలయం వద్దే కూర్చాంటా అని ప్రకటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. కామారెడ్డి జిల్లా అడ్లూరి ఎల్లారెడ్డికి చేరుకున్న ఆయన.. ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాములుని కేసీఆర్, కేసీఆర్ కొడుకు కేటీఆర్, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చేసిన హత్యేనని ఆరోపించారు.. ముఖ్యమంత్రి కామారెడ్డికి వచ్చే దాకా కలెక్టరేట్ వద్దనే కూర్చుంటాన్న ఆయన.. కామారెడ్డి రైతులకు న్యాయం…
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణుల ధర్నా ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు.
కామారెడ్డి ఇష్యూ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అభ్యంతరాలు వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. MCHRD లో జరుగుతున్న పట్టణ ప్రగతి వర్క్ షాప్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం కేటీఆర్ కామారెడ్డి ఇష్యూ పై మాట్లాడుతూ.. ఆ సమస్య ఎందుకు వచ్చిందని కేటీఆర్ మున్సిపల్ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ వేడి మామూలుగా ఉండదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా సెస్ ఎన్నికలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలే కాదు ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది.