కరోనా మందు కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్యకు ఎంత పేరు తెచ్చిందో.. అన్ని చిక్కులు కూడా తెచ్చిపెట్టింది.. ఆయన తయారు చేస్తున్న కరోనా మందుపై తేల్చేపనిలో ఉన్న ప్రభుత్వం.. అదే సమయంలో.. ఆయనకు భద్రత కల్పించి.. ఇంటి నుంచి తీసుకెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో శుక్రవారం.. ఆయనకు కృష్ణపట్నం తీసుకొచ్చిన పోలీసులు.. మళ్లీ అజ్ఞాతంలోకి తరలించారు.. అయితే, వారం రోజుల తర్వాత తన ఇంటికి వచ్చిన ఆనందయ్య.. తాను ఎక్కడికీ పోనని ఇక్కడే ఉంటానని చెప్పారు..…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసే కరోనా మందు కోసం వేలాది మంది ఎదురుచూస్తున్నారు.. కొందరు మందుకు తీసుకోవడానికి వెళ్లకపోయినా.. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.. ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.. మరోవైపు.. సోషల్ మీడియాలో కొందరు కేటుగాళ్లు.. కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందును తిరిగి ప్రారంభించారంటూ తప్పుడు ప్రచారానికి తెరలేపారు.. ఇవాళ్టి నుంచే మందు పంపిణీ చేస్తున్నారంటూ పుకార్లు సృస్టించారు.. దీంతో.. వందలాది మంది…
ఆనందయ్య మెడిసిన్కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. పది రోజుల క్రితం వరకు ఆనందయ్య మెడిసిన్ను అనేకమందికి ఉచితంగా సరఫరా చేశారు. అయితే, శాస్త్రీయత అంశంపై ప్రస్తుతం సీసీఆర్ఏఎస్ పరిశోధనలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఆనందయ్య కనిపించడం లేదని, ఆయన ఆచూకీ చెప్పానలి, ఆనందయ్యను వదిలిపెట్టాలని కృష్ణపట్నం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారం రోజులుగా ఆనందయ్య ఆచూకి లేదని గ్రామస్తులు ఆంధోళన చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య ఉన్నారనే విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆనందయ్యను వదిలిపెట్టాలని డిమాండ్…
ఆనందయ్య మందు తయారీపై సందిగ్ధం కొనసాగుతోంది. ఆనందయ్య మందు హానికరం కాదని ఇప్పటికే ఆయుష్ గుర్తించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుపై విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ, తిరుమల ఆయుర్వేద కళాశాలలు మందుపై పరిశోధన ప్రారంభించాయి. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుండి వివరాలను సేకరిస్తున్నారు. పరిశోధన రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. పరిశోధనకు సంబందించిన రిపోర్టులు వచ్చేందుకు ఆలస్యం అవుతుంది కాబట్టి మందు తయారీ మరింత ఆలస్యం కావొచ్చని…
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు వల్ల హాని లేదని ఆయుష్ డైరెక్టర్ రాములు అధికారికంగా ప్రకటించారు. ఆనందయ్య ఆ మందు తయారీలో 18 మూలికలను ఉపయోగిస్తున్నారని, వాటిని దగ్గరుండి పరీక్షించి నిర్ధారించుకున్నామని ఆయన చెప్పారు. అవన్నీ ఇంట్లోనూ మనచుట్టూ దొరికేవేననీ, అయితే వాటి మిశ్రమంలో వచ్చే ప్రభావం ఏమిటో మాత్రం అధ్యయనం చేయాలని తెలిపారు. ఇక, దాన్ని ఆయుర్వేద ఔషధంగా పరిగణించలేమని, అందుకు సంబంధించిన యాభై గ్రంథాల్లో ఈప్రసక్తి లేకపోవడం ఇందుకు కారణమని స్పష్టం…
కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందు.. ఎంతోమంది కరోనా రోగులను నయం చేసింది.. దీంతో.. క్రమంగా అటు పరుగులు పెట్టారు జనం.. అయితే, ఎప్పుడైతే.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం మొదలైందో.. అప్పటి నుంచి మందు పంపిణీ నిలిచిపోయింది.. ఇక, ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఆయుష్ పరిశోధన చేస్తున్న విషయం తెలిసిందే కాగా.. ఆయుష్ కమిషనర్ రాములు… ఇవాళ ఆనందయ్య మందుపై నివేదికను ఏపీ సీఎం వైఎస్…
కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత కొనసాగుతోంది. ఆనందయ్య మందు వలన ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయూష్ కమిషనర్ రాములు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనందయ్య తయారు చేస్తుంది నాటు మందుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇవాళ ప్రభుత్వానికి ఆయూష్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో మరోసారి మందును ఆనందయ్య తయారు చేయనున్నారు. ఆనందయ్య మందుపై ఐసీఎంఆర్ స్పందన పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆయూష్, ఐసీఎంఆర్ నివేదికల ఆధారంగా ఆనందయ్య మందుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం…
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం లో ఆనందయ్య నాటు మందు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నాటు మందుతో కరోనా తగ్గిపోతుందని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున ఆనందయ్య నాటు మందు కోసం కృష్ణపట్నం చేరుకున్నారు ప్రజలు. అయితే, తోపులాట జరగడంతో మందు పంపిణీని నిలిపివేశారు. ఈ మందుకు ఎంతవరకు శాస్త్రీయత ఉన్నది అని తెలుసుకోవడానికి ఆయుష్ శాఖ, ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేయబోతున్నారు. ఇప్పటికే ఆయుష్ అధికారులు మందును పరిశీలించారు. ఐసీఎంఆర్ కూడా పరిశోధనలు చేయబోతున్నది. ఈ మందుకు శాస్త్రీయత…
కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీకి నిన్ననే బ్రేక్లు పడ్డాయి… మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేదానిపై ఇంకా క్లారిటీ లేదు.. మందు పంపిణీ నిలిపివేసిన కారణంగా ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్యతో పాటు.. స్థానిక ఎమ్మెల్యే కూడా కోరారు.. ఆనందయ్య మందుపై తుది నివేదిక వచ్చిన తర్వాతే మందు తయారు చేయడం గానీ, పంపిణీ గానీ ఉండే అవకాశంఉంది. ఇప్పటికే ఆయూష్ బృందం కృష్ణపట్నంలో మకాం వేయగా.. ఇవాళ ఆయూష్ టీమ్ పర్యవేక్షణలో…
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు వారం ,10 రోజుల పాటు బ్రేక్ పడింది. ఇక అర్ధరాత్రి ఆనందయ్య ఇంటికి , మందు పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు పోలీసులు. మందు పంపిణీ కేంద్రాన్ని ఖాళీ చేయించి అక్కడున్న మందు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. త్వరలో ప్రభుత్వమే మ౦దు పంపిణీ చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఆనందయ్య కరోనా మందుకు ప్రభుత్వ అనుమతులు లభించే ఛాన్స్ ఉంది. ఇవాళ కృష్ణపట్నంకు ఐసీఎంఆర్ టీమ్ రానుంది. ఇప్పటికే…