కరోనా వైరస్కు ఆయుర్వేద మందు తయారు చేస్తూ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయారు ఆనందయ్య.. ఆయన తయారు చేస్తూ.. కరోనా రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులోని శాస్త్రీయతను తేల్చేపనిలో పడిపోయారు అధికారులు.. ఇదే సమయంలో.. ఆనందయ్యను అరెస్ట్ చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి.. కృష్ణపట్నంలో ఆనందయ్యను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. అయితే దీనిపై స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్.. వివరణ ఇస్తూ.. ఆనందయ్యను అరెస్ట్ చేయలేదని…
ఇప్పుడు చర్చ మొత్తం కృష్ణపట్నంలో ఆనందయ్య అందిస్తున్న కరోనా ఆయుర్వేద మందుపైనే.. కరోనా రోగుల నమ్మకం, విశ్వాసం ఎలా ఉన్నా ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దీనిపై ఫోకస్ పెట్టాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆనందయ్య ఆయుర్వేద చికిత్సపై అధ్యయనం జరుగుతోందన్నారు.. కేంద్ర ఆయుష్ శాఖ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపామన్న ఆయన.. ఆయుష్ విభాగం అధ్యయనం చేయనుంది.. సోమవారం…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ను అడ్డుపెట్టుకుని అందినకాడికి దండుకుంటున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు, ఇక, ఫార్మా కంపెనీల దందా చెప్పాల్సిన పనేలేదు.. ఈ తరుణంలో.. ఉచితంగా కరోనావైరస్కు ఆయుర్వేద మందు పంపిణీ చేస్తూ వార్తల్లో నిలిచారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య.. పదులు, వందల్లో వచ్చేవారి సంఖ్య ఏకంగా వేలకు పెరిగిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా మందు పంపిణీ నిలిపివేయాల్సిన పరిస్థితి. మరోవైపు.. ఆ మందులోని శాస్త్రీయతను తేల్చేపనిలోపడిపోయారు. ఆయుష్తో పాటు ఐసీఎంఆర్ కూడా రంగంలోకి దిగింది. కృష్ణపట్నంకు…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు పనితీరు.. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు.. దాటేసింది.. దీంతో.. కోవిడ్ మందు కోసం తరలివచ్చినవారితో కృష్ణపట్నం జనసంద్రంగా మారిపోయింది.. దీంతో.. తాత్కాలికంగా పంపిణీని నిలిపివేశారు. ఇక, ఆయుర్వేద మందు పంపిణీపై స్పందించిన సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి.. ఇవాళ సాయంత్రం ఐసీఎంఆర్ బృందం నెల్లూరు కి చేరుకుంటుందని.. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా మందు కోసం ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.. వేల…
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆయుర్వేద మందకు ప్రజలు పోటెత్తారు. ఒక్కసారిగా జనం పోటెత్తడంతో తోపులాట జరిగింది. తోపులాట జరగడంతో ఆయుర్వేద మందును నిలిపేశారు. మందు కోసం కనీసం 50వేల మంది వరకు వస్తారని అంచనా వేశారు. అయితే, పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. కరోనా సోకిన రోగులు అంబులెన్స్ లో అక్కడికి వస్తుండటంతో మాములు ప్రజలు ఆందోళన చేశారు. జనాలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మందు పంపిణీవద్ద సోషల్ డిస్టెన్స్ కనిపించలేదు. ఇక…