Rohit Sharma On Retirement: సిడ్నీ టెస్ట్కు దూరంగా కూర్చోవడం అంటే తాను రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు కాదని టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. దీనితో పాటు, తన పేలవమైన ఫామ్ను దృష్టిలో ఉంచుకుని సిడ్నీ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. తన నిర్ణయాన్ని మ్యాచ్కు ఒక రోజు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు చెప్పానని తెలిపాడు. దాంతో సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్…
IND vs AUS: మెల్బోర్న్ టెస్ట్లో ఆరంభంలోనే టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 340 రన్స్ భారీ లక్ష్యంతో ఐదో రోజు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన భారత జట్టు కేవలం 33 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది.
హీరోయిన్ అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. గత నెలలో ఈ జంట తమ అభిమానులతో ఈ శుభవార్త పంచుకున్నారు. త్వరలో తాము ముగ్గురము కాబోతున్నట్లు వారు ప్రకటించారు. గర్భం దాల్చినప్పటి నుంచి ఈ జంట మీడియాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా అతియా బేబీ బంప్తో ఉన్న కెమెరాలకు చిక్కింది. Also Read: Shruti Haasan: అమ్మ నాన్న వల్లే మద్యానికి బానిసయ్యా.. శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్…
BGT Series: మెల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం…
AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి బయటపడింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్కు 39 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో టీమిండియా ‘ఫాలో ఆన్’ గండం నుండి బయట పడింది. వీరి మెరుపు ఇన్నింగ్స్తో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ ముప్పును తప్పించుకుంది. ఈ కారణంతో డ్రెస్సింగ్ రూమ్లో టీమిండియా కోచ్…
India Follow On: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బ్రిస్బేన్లోని గబ్బా వేదికగా 3వ టెస్టు 4వ రోజు అంటే మంగళవారం (డిసెంబర్ 17)న వర్షం, బ్యాడ్ లైట్ కారణంగా ఆట చాలాసార్లు అంతరాయం కలిగింది. అయితే, ఇది భారత జట్టు దృష్టిలో మంచి విషయం అని చెప్పాలి. దీనికి కారణం ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీలతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక నాల్గవ రోజు ఆట ముగిసే…
IND vs AUS: గబ్బా టెస్ట్ మ్యాచ్లో నాలుగో రోజు ఆటను వర్షం కారణంగా ముందుగానే ముగించాల్సి వచ్చింది. KL రాహుల్, రవీంద్ర జడేజాల హాఫ్ సెంచరీల సహాయంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో క్రికెట్ టెస్టులో నాల్గవ రోజున భారత్ ఫాలో-ఆన్ను కాపాడుకుంది. నాల్గవ రోజు ముగియడంతో మ్యాచ్ డ్రాగా మారుతున్నట్లు కనిపిస్తోంది. జడేజా 123 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్తో 77 పరుగులు చేశాడు. మరోవైపు కెఎల్ రాహుల్ 139 బంతుల్లో 84 పరుగులు…
IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో మ్యాచ్ బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో జరుగుతోంది. ఈరోజు మ్యాచ్లో నాలుగో రోజు కొనసాగుతుంది. మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 445 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే, మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆరంభం మరోసారి నిరాశపరిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలి ఓవర్లోనే పెవిలియన్కు చేరుకున్నాడు. మ్యాచ్ నాలుగో రోజు బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ చక్కటి…
వ్యక్తిగత కారణాలతో పెర్త్ టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తొలి మ్యాచ్ విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. దీంతో అడిలైడ్ టెస్ట్కు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. జైస్వాల్-రాహుల్ జోడిని కొనసాగించారు. దాంతో హిట్మ్యాన్ 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. ఆ స్థానంలో రోహిత్ ఘోరంగా విఫలం అయ్యాడు. అటు ఓపెనర్గా రాహుల్ కూడా విఫలమయ్యాడు. దీంతో తాజాగా టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకొన్నట్లు తెలుస్తోంది.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్లో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్స్ పడగొట్టడంతో భారత్ 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి టాప్ స్కోరర్. 54 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 రన్స్ చేశాడు. కేఎల్ రాహుల్ (37), శుభ్మన్ గిల్ (31) పరుగులు చేశారు. స్టార్క్ ‘ఆరే’యగా..…