BGT Series: మెల్బోర్న్ టెస్టు ముందు టీమిండియాకు కష్టాలు.. రోహిత్, రాహుల్ లకు గాయాలు.. టీమ్పై ప్రభావం పడనుందా?
- టీమిండియాకు కష్టాలు..
- రోహిత్, రాహుల్ లకు గాయాలు..
- టీమ్పై ప్రభావం పడనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BGT Series: మెల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా కొనసాగుతోంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే నాలుగో టెస్టుకు అత్యంత కీలకం కానుంది.
Also Read: Brazil Accident: బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి
Also Read
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
ఒకవేళ కేఎల్ రాహుల్ దూరమైతే, అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. దేశీయ క్రికెట్లో తన అద్భుతమైన ప్రదర్శనతో ఈశ్వరన్ జాతీయ జట్టుకు తన పేరు వినిపించాడు. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 48.87 సగటుతో 7674 పరుగులు చేసిన ఈ కుడిచేతి బ్యాట్స్మన్ 27 సెంచరీలు, 29 అర్ధసెంచరీలతో తన సత్తా చాటాడు. అయితే, అతనికి ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాల్సి ఉంది. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో ఆటకు దూరమైతే, అతని స్థానంలో జట్టు మేనేజ్మెంట్ ముందున్న ఎంపికలు చాలా ఉన్నాయి. జట్టులో బ్యాటింగ్ బలాన్ని పెంచాలనుకుంటే యువ ఆటగాడు ధృవ్ జురెల్కు అవకాశం ఇవ్వవచ్చు. మరోవైపు, వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేయడం ద్వారా జట్టుకు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా మద్దతు పొందవచ్చు.
Also Read: Game Changer : న భూతో న భవిష్యత్ అనేలా అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్
రోహిత్ శర్మ టెస్టుకు దూరమైతే, జట్టుకు నాయకత్వం వహించడానికి జస్ప్రీత్ బుమ్రా ఎలాగూ అందుబాటులో ఉన్నాడు. రోహిత్ శర్మ తన రెండవ బిడ్డ పుట్టిన సందర్భంగా పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్నప్పుడు, బుమ్రా జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. ఈ నేపథ్యంలో, నాలుగో టెస్టు ఇరు జట్లకు విజయాల మార్గాన్ని నిర్ణయించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దింతో ప్రస్తుతం అభిమానులు ఇప్పుడు ఈ గాయాల నుంచి జట్టు ఎలా అధిగమిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!