BGT Series: మెల్బోర్న్ టెస్టు ముందు టీమిండియాకు కష్టాలు.. రోహిత్, రాహుల్ లకు గాయాలు.. టీమ్పై ప్రభావం పడనుందా?
- టీమిండియాకు కష్టాలు..
- రోహిత్, రాహుల్ లకు గాయాలు..
- టీమ్పై ప్రభావం పడనుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BGT Series: మెల్బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టుకు ముందు టీమిండియా కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గాయాల కారణంగా టీమిండియా జట్టు ప్రణాళికలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. శనివారం కేఎల్ రాహుల్ చేతికి గాయం కాగా, ఆదివారం రోహిత్ శర్మ మోకాలికి గాయమైంది. ఈ ఇద్దరి గాయాల తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, వారు టెస్టుకు దూరమైతే జట్టుకు పెద్ద దెబ్బ అవుతుంది. ఇక 5 టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా కొనసాగుతోంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో జరిగే నాలుగో టెస్టుకు అత్యంత కీలకం కానుంది.
Also Read: Brazil Accident: బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు.. నేరస్థులపై ఎందుకు పెట్టరు?: టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఒకవేళ కేఎల్ రాహుల్ దూరమైతే, అతని స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. దేశీయ క్రికెట్లో తన అద్భుతమైన ప్రదర్శనతో ఈశ్వరన్ జాతీయ జట్టుకు తన పేరు వినిపించాడు. ఇప్పటివరకు 101 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 48.87 సగటుతో 7674 పరుగులు చేసిన ఈ కుడిచేతి బ్యాట్స్మన్ 27 సెంచరీలు, 29 అర్ధసెంచరీలతో తన సత్తా చాటాడు. అయితే, అతనికి ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయాల్సి ఉంది. మరోవైపు, కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో ఆటకు దూరమైతే, అతని స్థానంలో జట్టు మేనేజ్మెంట్ ముందున్న ఎంపికలు చాలా ఉన్నాయి. జట్టులో బ్యాటింగ్ బలాన్ని పెంచాలనుకుంటే యువ ఆటగాడు ధృవ్ జురెల్కు అవకాశం ఇవ్వవచ్చు. మరోవైపు, వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేయడం ద్వారా జట్టుకు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా మద్దతు పొందవచ్చు.
Also Read: Game Changer : న భూతో న భవిష్యత్ అనేలా అమెరికాలో గేమ్ ఛేంజర్ ఈవెంట్
రోహిత్ శర్మ టెస్టుకు దూరమైతే, జట్టుకు నాయకత్వం వహించడానికి జస్ప్రీత్ బుమ్రా ఎలాగూ అందుబాటులో ఉన్నాడు. రోహిత్ శర్మ తన రెండవ బిడ్డ పుట్టిన సందర్భంగా పెర్త్ టెస్టుకు దూరంగా ఉన్నప్పుడు, బుమ్రా జట్టును విజయవంతంగా ముందుకు నడిపించాడు. ఈ నేపథ్యంలో, నాలుగో టెస్టు ఇరు జట్లకు విజయాల మార్గాన్ని నిర్ణయించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దింతో ప్రస్తుతం అభిమానులు ఇప్పుడు ఈ గాయాల నుంచి జట్టు ఎలా అధిగమిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!