ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-35లో గుజరాత్ టైటాన్స్ (GT) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ కోల్పోయి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ను కైవసం చేసుకోవాలంటే గుజరాత్ 204 పరుగులు సాధించాల్సి ఉంటుంది. కాగా.. ఈ మ్యాచ్లో కెప్టెన్ అక్షర్ పటేల్(39) రాణించాడు.…
నేడు ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ లక్ష్యం 189 పరుగులు. ఈ మ్యాచ్లో అభిషేక్ పోరెల్(49) అత్యధిక పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్(38), అక్షర్ పటేల్ (34), ట్రిస్టన్…
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తనకు హోం గ్రౌండ్ అని, ఈ మైదానం పరిస్థితుల గురించి తనకంటే బాగా ఇంకా ఇంకెవరికి తెలుసు? అని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా అని తెలిపాడు. స్టేడియం చిన్నదే అయినా.. పిచ్ మాత్రం సవాల్ విసురుతుంది అని చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ తన క్యాచ్ను వదిలేయడం కలిసొచ్చిందని రాహుల్ తెలిపాడు. ఐపీఎల్ 2025లో…
ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓటమి చవిచూసింది. ఆర్సీబీ నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని డీసీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. ‘లోకల్ బాయ్’ కేఎల్ రాహుల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 7×4, 6×6) బెంగళూరు పతనాన్ని శాసించాడు. 5 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్ను కెప్టెన్ పాటీదార్ వదిలేయడంతో ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది. మొదట…
ఐపీఎల్ 2025లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుంది. గత మ్యాచ్లో లక్నోపై గెలిచిన ఢిల్లీ ఫుల్ జోష్లో ఉంది. అదే ఊపును ఎస్ఆర్హెచ్పై కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్లో గెలిచిన సన్రైజర్స్.. లక్నోపై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మంచి విజయంతో మరలా పుంజుకోవాలని చూస్తోంది. లక్నోతో మ్యాచ్లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం…
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో రాహుల్ జట్టులోకి చేరే అవకాశం ఉంది. తనకు కూతురు పుట్టిన కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన తొలి మ్యాచ్కు రాహుల్ దూరంగా ఉన్నాడు. అయితే.. మార్చి 30న వైజాగ్లో జరిగే మ్యాచ్లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశముందని ఆ జట్టు ఆటగాడు విపరాజ్ నిగమ్…
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిలు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. సోమవారం అతియా పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాహుల్, అతియాలు తమ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రాహుల్, అతియా దంపతులకు క్రికెటర్స్, సెలబ్రిటీస్, ఫాన్స్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్లేయర్స్ ప్రత్యేక విషెష్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ…
ఐపీఎల్ 2025లో భాగంగా.. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ విశాఖలోని ACA–VDCA క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రాత్రి 7.30 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గైర్హాజరవనున్నట్లు సమాచారం. భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆయన జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జట్టులో ఆటగాడైన మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ ఈ విషయాన్ని తెలిపింది.