Gabba Test: గబ్బా టెస్ట్.. వ్యూహం మార్చిన టీమిండియా!
- డిసెంబర్ 14 నుంచి మూడో టెస్టు ప్రారంభం
- రోహిత్ ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశాలు
- కీలకంగా గబ్బా టెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యక్తిగత కారణాలతో పెర్త్ టెస్ట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడలేదు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తొలి మ్యాచ్ విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. దీంతో అడిలైడ్ టెస్ట్కు రోహిత్ అందుబాటులోకి వచ్చినా.. జైస్వాల్-రాహుల్ జోడిని కొనసాగించారు. దాంతో హిట్మ్యాన్ 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. ఆ స్థానంలో రోహిత్ ఘోరంగా విఫలం అయ్యాడు. అటు ఓపెనర్గా రాహుల్ కూడా విఫలమయ్యాడు. దీంతో తాజాగా టీమిండియా తన వ్యూహాన్ని మార్చుకొన్నట్లు తెలుస్తోంది. సీమర్లకు స్వర్గధామమైన గబ్బా మైదానంలో హిట్మ్యాన్ ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
సాధారణంగా నెట్స్లో కొత్త బంతిని ఎదుర్కొనేందుకు ఓపెనర్లు వస్తారు. బ్రిస్బేన్లో జరిగిన సెషన్లలో రోహిత్ శర్మ కూడా త్వరగానే వచ్చి ప్రాక్టీస్ చేశాడు. బంతి మెరుపు కోల్పోని సమయంలోనే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ల బౌలింగ్లో సాధన చేశాడు. దీంతో గబ్బాలో రోహిత్ ఇన్నింగ్స్ను ఆరంభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సీమర్లను ఎదుర్కోవడంలో హిట్మ్యాన్కు ఉన్న అనుభవం దృష్ట్యా భారత్ ఈ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది.
Also Read
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి.. భారీ మార్పు తప్పదా?
ఇక టీమిండియా సెషన్స్ మొత్తంను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కోచింగ్ బృందంతో కలిసి పర్యవేక్షించాడు. విరాట్ కోహ్లీతో గౌతీ సుదీర్ఘంగా చర్చించాడు. అనంతరం టీమ్ ప్లేయర్స్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేశారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియంలో డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. పెర్త్ టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో గెలవగా.. అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో గెలుపొందింది. ప్రస్తుతం 1-1 సిరీస్ సమంగా ఉన్న నేపథ్యంలో గబ్బా టెస్ట్ కీలకంగా మారింది.
తాజావార్తలు
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!