AUS vs IND: చివరకి ఇలా తయారయ్యారేంట్రా బాబు.. ‘ఫాలో ఆన్’ తప్పింనదుకు సంబరాలు (వీడియో)
- ‘ఫాలో ఆన్’ తప్పింనదుకు సంబరాలు చేసుకున్న
- టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AUS vs IND: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి బయటపడింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ చివరి వికెట్కు 39 పరుగుల కీలక భాగస్వామ్యం అందించడంతో టీమిండియా ‘ఫాలో ఆన్’ గండం నుండి బయట పడింది. వీరి మెరుపు ఇన్నింగ్స్తో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ ముప్పును తప్పించుకుంది. ఈ కారణంతో డ్రెస్సింగ్ రూమ్లో టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.
Also Read: SBI Clerk Vacancy 2024: ఎస్బిఐలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 13,735 క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
Also Read
- Tilak Varma: "నువ్వు అస్సలు తగ్గొద్దు".. శ్రీలంకతో ఫైనల్ ఫైట్కు ముందు వైభవ్కు తిలక్ ఫుల్ సపోర్ట్..
- Chittoor: 'ఆమె లేక నేను లేను'.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
- Heavy Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మొదటి నుంచి వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇక టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ (84), జడేజా (77) కీలక ఇన్నింగ్స్లు ఆడి భారత్ స్కోర్బోర్డును ముందుకు నడిపించారు. అయితే, చివరిలో టెయిలెండర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ మరో వికెట్ పడకుండా విలువైన పరుగులు సాధించడంతో భారత్ను ‘ఫాలో ఆన్’ ప్రమాదం నుంచి గట్టెక్కించారు.
#TeamIndia have avoided the follow-on. AUSTRALIA WILL HAVE TO BAT AGAIN!#AUSvINDOnStar 👉 3rd Test, Day 5 | 18th DEC, WED, 5:15 AM on Star Sports! #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/DqW3C9DMJX
— Star Sports (@StarSportsIndia) December 17, 2024
Also Read: WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు కడప జిల్లా విద్యార్థిని.. హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
ఇక రూల్స్ ప్రకారం.. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయడంతో.. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులు చేయకపోతే ‘ఫాలో ఆన్’లో పడినట్లు అవుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా ఆహ్వానిస్తే, భారత్ మళ్లీ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సి ఉండేది. అయితే, భారత్ 246 పరుగులు దాటించి ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. ఇక భారత్ను రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్కు ఆహ్వానించాలా, వద్దా అనేది ఆస్ట్రేలియా ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఒకవేళ టీమిండియా ఆలౌట్ అయినా రెండో ఇన్నింగ్స్లో ముందుగా బ్యాటింగ్ చేయాల్సిన బాధ్యత ఆస్ట్రేలియాదే. దీంతో భారత్కు మ్యాచ్ను డ్రా చేసుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Tilak Varma: “నువ్వు అస్సలు తగ్గొద్దు”.. శ్రీలంకతో ఫైనల్ ఫైట్కు ముందు వైభవ్కు తిలక్ ఫుల్ సపోర్ట్..
-
Chittoor: ‘ఆమె లేక నేను లేను’.. ప్రేమించిన అమ్మాయి సమాధి వద్దే ప్రియుడి ఆత్మహత్య..
-
Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లదా?
-
Nurse Transfer Request: మంత్రి కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్న నర్సు.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!